అన్వేషించండి

Wheat Production in India: అలాంటి ఆలోచనే లేదు, గోధుమల దిగుమతుల అంశంపై స్పష్టతనిచ్చిన కేంద్రం

Wheat Production in India: గోధుమలు దిగుమతి చేసుకోవాలనే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Wheat Production in India:

సరిపడ నిల్వలున్నాయ్..

దేశీయ అవసరాల కోసం భారత్ గోధుమల్ని దిగుమతి చేసుకోనుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి గోధుమల్ని దిగుమతి చేసుకోవటం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వెల్లడించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద సరిపడా నిల్వలున్నాయని, ప్రజా పంపిణీలో ఎలాంటి సమస్యలు రావని తెలిపింది. దేశీయ అవసరాలకు ఇబ్బంది తలెత్తదని పేర్కొంది. ట్విటర్ వేదికగా ఈ విషయం స్పష్టం చేసింది. "గోధుమల్ని దిగుమతి చేసుకునే ఆలోచన లేదు. 
దేశీయ అవసరాలకు సరిపడ నిల్వలున్నాయి" అని ట్వీట్ చేసింది. ఈ ఏడాది రబీ పంటకు ముందు విపరీతమైన వేడి గాలులు వీచాయి. ఆ సమయంలో గోధుమ పంట దిగుబడిపై ప్రభావం పడింది. 2021-22 మధ్య కాలంలో గోధుమ దిగుబడి 106.84 మిలియన్ టన్నులకు పడిపోయింది. నిజానికి ఈ ఏడాది 111 మిలియన్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ...ఆ స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక..ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. రికార్డు స్థాయి ధరలు పలికాయి. వేడిగాలుల కారణంగా దిగుబడి పడిపోవటమూ ధరల పెరుగుదలకు ఓ కారణం. రష్యా, ఉక్రెయిన్‌ పెద్ద ఎత్తున గోధుమల్ని విదేశాలకు ఎగుమతి చేస్తాయి. అక్కడ సరఫరా వ్యవస్థలు నిలిచిపోవటం వల్ల ఆ దేశాలపై ఆధారపడిన దేశాల్లో తిప్పలు తప్పటం లేదు.

 

ఎగుమతులపై ఆంక్షలు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో టన్ను గోధుమల ధర రూ.2,400-2,500గా పలికింది. అయితే  రబీలో పండించిన గోధుమలు మండీల్లోకి వచ్చాక..కాస్త ధరలు తగ్గాయి. అయినా...కనీస మద్దతు ధర కన్నా ఎక్కువే పలుకుతున్నాయి ధరలు. టన్నుకి రూ.2,015 ఎమ్‌ఎస్‌పీ ఉంది. గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు...విమర్శలకు తావిచ్చినా...ప్రస్తుతానికైతే కొంత వరకూ ధరలు తగ్గటానికి కారణమయ్యాయి. చాలా రోజుల పాటు గోధుమల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది కేంద్రం. గోధుమ ఎగుమతులను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, తరవాత గోధుమ పిండి ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో ప్రకటించింది. ఈ ఏడాది మే ముందు వరకూ గోధుమలు భారీగానే ఎగుమతి చేసింది భారత్. ఈ కారణంగా దేశీయంగా నిల్వలు నిండుకున్నాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే, ఇక్కడా కొరత ఏర్పడుతుందని గ్రహించిన కేంద్రం, వెంటనే ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. తరవాత గోధుమ పిండి విషయంలోనూ ఆ ఆంక్షల్ని కొనసాగించింది. గోధుమ పిండి ఎగుమతిదారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు సరఫరా చేయటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

దేశీయంగా నిల్వలు గమనించుకుని, నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వ అనుమతితోనే ఎగుమతి చేయాలని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఉన్న కొరతతో కొందరు కావాలనే బ్లాక్ మార్కెట్‌ను సృష్టించే ప్రమాదముందని అంటోంది కేంద్రం. ఈ కారణంగా నాణ్యత లోపించే అవకాశముందని అభిప్రాయపడింది. భారత్ గోధుమలు ఎగుమతులు నిషేధించిన సమయంలో అంతర్జాతీయంగా ఒక్కసారిగా  ధరలు పెరిగిపోయాయి. ఈ నిర్ణయంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. భారత్ మాత్రం దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది.  

Also Read: Congress Meeting: భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్న కాంగ్రెస్, అక్కడి నుంచే మొదలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
Advertisement

వీడియోలు

Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
Maoist Commander Hidma Encounter in AP  | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
Supritha Naidu: అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
Puttaparthi Sathya Sai Baba: పుట్టపర్తిలో సెలబ్రిటీల సందడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్యరాయ్ ఫొటోలు చూశారా
పుట్టపర్తిలో సెలబ్రిటీల సందడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్యరాయ్ ఫొటోలు చూశారా
Divyabharathi: దర్శకుడి నీచమైన కామెంట్స్‌పై హీరోయిన్ ఆగ్రహం... వివాదంలో సుడిగాలి సుధీర్ సినిమా!
దర్శకుడి నీచమైన కామెంట్స్‌పై హీరోయిన్ ఆగ్రహం... వివాదంలో సుడిగాలి సుధీర్ సినిమా!
Embed widget