అన్వేషించండి

Organ Donation Law: అవయవ దానం చట్టంలో కీలక మార్పులు, కేంద్రం కొత్త మార్గదర్శకాలివే

Organ Donation Law: అవయవ దానం చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది.

Organ Donation Law:

వన్ నేషన్, వన్ పాలసీ..

అవయవ దానం విషయంలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. వన్ నేషన్, వన్ పాలసీలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. అవయవదానంతో పాటు అవయవ మార్పిడిలోనూ మార్పులు చేర్పులు చేసింది. ఈ ప్రక్రియలను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అవయవ మార్పిడి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. కానీ...చనిపోయిన తరవాత అవయవ దానం చేస్తున్న వారి సంఖ్య మాత్రం 0.01%మే. ఇవి స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన లెక్కలే. ఇకపై వీటిని ప్రోత్సహించేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 

ఏమే మార్పులంటే..? 

65 ఏళ్లు పైబడిన రోగులెవరైనా చనిపోయిన వాళ్ల నుంచి "అవయవం పొందేందుకు" వీలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. గతంలో ఈ వయో పరిమితి 65గా ఉండేది. ఇప్పుడు 65 ఏళ్లు దాటిన వాళ్లు కూడా అవయవాలు పొందేందుకు అవకాశముంటుంది. 65 ఏళ్ల వాళ్లను ఈ విషయంలో "వృద్ధులుగా" పరిగణించడం సరి కాదని, అందుకే మార్పులు చేశామని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే...ఎక్కువ కాలం బతికుండే అవకాశమున్న యువతీ, యువకులకు అధిక ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది. మొత్తానికైతే...ఇప్పుడు ఎవరైనా సరే చనిపోయిన వారి నుంచి అవయవాలు తీసుకునేందుకు "రిజిస్టర్" చేసుకోవచ్చు. NOTTO వెబ్‌సైట్‌లో ఈ కొత్త గైడ్‌లైన్స్‌ని అప్‌డేట్ చేశారు. అవయవాలు తీసుకునేందుకు రిజిస్టర్‌ చేసుకునే వాళ్లకు ఎలాంటి ఫీజ్‌ వసూలు చేయరు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో కొంత మేర రుసుము వసూలు చేసే వాళ్లు. ఇకపై ఈ ఛార్జీలు విధించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

వైద్యుల డిమాండ్..

జనవరి 9వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ పాలసీపై చర్చించింది. అసలు ఈ మార్పులకు కారణం...గతేడాది సెప్టెంబర్‌లో ఓ బాలుడు వేసినే పిటిషన్. ఓ 17 ఏళ్ల కుర్రాడు తన తండ్రికి కాలేయ దానం చేయాలని భావించాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. చేసేదేమీ లేక ఆ కుర్రాడు సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు, అందులోనూ మైనర్లు అవయవ దానం చేయొచ్చా అన్న చర్చ అప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మైనర్లు అవయవ దానం చేసేందుకు వీల్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప అందుకు ఆమోదం లభించదు. మైనర్లూ అవయవదానం చేసేలా చట్టంలో మార్పులు చేసే బదులు...చనిపోయిన వాళ్లు తప్పనిసరిగా అవయవదానం చేయాలన్న నిబంధన పెట్టాలని కొందరు వైద్యులు డిమాండ్ చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే...ఓ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తి నుంచి మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అవయవం దానం చేస్తే...మృతుడి "నివాస ప్రాంత ధ్రువీకరణ పత్రం"సమర్పించాల్సి ఉండేది. ఇప్పటి నుంచి ఈ నిబంధనను పక్కన పెట్టేయాలని కేంద్రం ఆదేశించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget