అన్వేషించండి

Food poison: పితృ మాసంలో ఫుడ్ పాయిజన్- 80 మందికి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని దాదాపు 80 మంది అస్వస్థతకు గురయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని దాదాపు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు గ్రామంలోని కొందరికి కడుపునొప్పి రాగా... మరికొందరు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇందులో ఓ నెల రోజుల బాలింతతో పాటూ పది మంది చిన్నారులు ఉన్నారు. 

నిన్న సాయంత్రం పూట మెండపల్లి గ్రామంలో పెత్రామాస (పితృ మాసం) కార్యక్రమం సందర్భంగా ఓ ఇంట్లో స్థానికులకు భోజనం ఏర్పాటు చేశారు. భోజనాలు తిన్న కొందరు అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పితో, వాంతులు, విరోచనాలు చేసుకోగా.. ఉదయం తెల్లవారు జామున కొందరు ఇదే పరిస్థితి తలెత్తి ఇబ్బంది పడ్డారు. గ్రామస్తులు 108కు సమాచారం ఇచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కొందరిని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో... మరికొందరిని అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి, మరికొందరూ నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందిస్తునారు. ఉట్నూర్ ఏజెన్సీ డిప్యూటీ డీఏంహెచ్ఓ  డా. బుక్య విజయ్ కుమార్ అస్వస్థతకు గురైన వారిని పరీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ డిప్యూటీ డిఏంహెచ్ఓ డా బుక్య విజయ్ కుమార్ మాట్లాడుతూ.... మండపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు ఓ విందు కార్యక్రమంలో పాల్గొని భోజనం చేయగా రాత్రి నుండి కొందరికి కడుపునొప్పి రావడంతో పాటు మరికొంతమంది వాంతులు విరోచనాలు చేసుకున్నారు. ఉదయం తెల్లవారుజామున సైతం మరికొందరు కడుపునొప్పితోపాటు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో గ్రామస్తులు 108కు సమాచారం అందించగ.. అస్వస్థతకు గురైన వారందరిని ఆసుపత్రికి తరలించారు. పది మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత మందిని తరలించగా.. పడకగదులు లేక మరికొందరిని ఉట్నూర్ ఆసుపత్రికి, మరికొందరు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోయారని చెప్పారు.  

 ప్రస్తుతానికి అస్వస్తతకు గురైన వారి పరిస్థితి కొంత నిలకడగా ఉందని గ్రామంలో తమ వైద్య బృందం ఇంటింటా తిరిగి పరీక్షలు నిర్వహిస్తూ మూడు రోజులపాటు క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు అదేవిధంగా శానిటేషన్ పరంగా ఆర్డబ్ల్యూఎస్ , పంచాయతీ అధికారులకు సైతం సమాచారం అందించి అక్కడ నీటి శాంపిల్స్ తో పాటు ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన ఆహార పదార్థాల శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికీ ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా మూడు రోజులపాటు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఏజెన్సీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. 

స్థానిక అధికారులు అప్రమత్తం
ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఆహారం తిని అనారోగ్యానికి ఘటనపై స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వరకు ఉన్నారు? మిగిలిన వారి పరిస్థితి ఏమిటనే ఆరా తీస్తున్నారు. మిగిలిన వారిని కనుగొని వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ వైద్యం అందిస్తున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget