అన్వేషించండి
US Deportation: అమెరికాలో విదేశాయులకు డిపోర్టేషన్ టెన్షన్! భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
Student Suicide: అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్రమవలసదారుడిగా స్వదేశానికి పంపిస్తారేమోనన్న భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వలసదారులను తిప్పి పంపుతున్న అమెరికా
Source : X
US Deportation: అమెరికాలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం.. డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ నిమిషంలో ఏ నిర్ణయం తీసుకుంటాడోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ట్రంప్ అన్నట్లుగానే... బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచే అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. అణువణువు వెతికిపట్టుకుని మరీ బేడీలు వేసి స్వదేశాలకు సొంత విమానఖర్చులతో సాగనంపుతున్నారు. దీంతో అక్రమ పద్ధతుల్లో అగ్రరాజ్యం చేరుకున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ భయంతోనే అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి బలవన్మరణం చేసుకోవడం కలకలం రేపుతోంది.
భయమే యమపాశం
లక్షల్లో జీతం... సౌకర్యవంతమైన జీవితం, పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం వంటి కోటి ఆశలతో అమెరికాలో కొలువు సంపాదించేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. విద్యార్థులుగానే అక్కడికి వెళ్లి... చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు(America) చదువుల కోసం వెళ్తున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. ఆస్తులు అమ్ముకుని లక్షలాది రూపాయులు ఖర్చుచేసి ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం చేరుకున్న విద్యార్థుల్లో ఇప్పుడు డిపోర్టేషన్( Deportation) గుబులు పట్టుకుంది. ఇప్పటి వరకు స్టూడెంట్ వీసాపై అక్కడికి చేరుకుని ఎలాగో అలా చిన్నచిన్న పనులు చేసుకుంటూ నెట్టుకొస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ట్రంప్ ప్రభుత్వ అధికారులు డేగకళ్లతో వెతికి మరీ ఇలాంటి వారిని పట్టుకుని తిరిగి వారివారి స్వదేశాలకు పంపిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందిని ఇప్పటికే ఇంటిముఖం పట్టించారు.
ఉద్యోగం దొరుకుతుందో లేదో...అసలు విదేశీయలకు ఉద్యోగాలు ఇస్తారో లేదో, ఉద్యోగం దొరికే వరకు బతకం ఎలా వంటి రకరకాల ఊహాగానాలతో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థుల్లో(Students) ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారిలో ఆందోళన అధికమవుతోంది. ఇప్పటి వరకు మంచి ఉద్యోగం దొరికే వరకు అక్కడ,ఇక్కడ పార్ట్టైం జాబ్లు చేస్తున్న వారంతా...ఒక్కసారిగా ఎదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటూ జాయిన్ అవుతున్నారు. మరికొందరికి ఆ ఉద్యోగాలు కూడా లేక సతమతమవుతున్నారు. ఇన్ని ఆందోళనల మధ్య ఓ తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉన్నత విద్య కోసం న్యూయార్క్(Newyork) వెళ్లిన సాయికుమార్రెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు అతని స్నేహితులు ఓ వీడియో విడుదల చేశారు. డిపోర్టేషన్ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యూయార్క్లో ఉంటున్న అతను ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అధికారులు అతను పనిచేస్తున్న చోటుకు వచ్చి తనిఖీలు చేశారు. వివరాలన్నీ రాబట్టి పాసుపోర్టు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనను కూడా డిపోర్ట్ చేస్తారని భయపడే పనిచేసే ప్రదేశంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అమెరికాకు అక్రమంగా వలసలు
అగ్రరాజ్యం కావడం, సౌకర్యవంతమైన జీవితం, జీతం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు అమెరికాలో జీవించడానికే ఇష్టపడుతుంటారు.అయితే ఇలా పెద్దఎత్తున విదేశాల నుంచి తరలివచ్చే వారికి వసతి, భోజనం సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతోపాటు...అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని భావించి అగ్రరాజ్యం అతికొద్ది వీసాలు మాత్రమే జారీ చేస్తోంది.అది కూడా ఉన్నత విద్య కోసం వచ్చే వారికే ఎక్కువ వీసాలు ఇస్తోంది. వచ్చామా చదువుకున్నామా తిరిగి వెళ్లిపోయామా అన్నట్లు ఉండాలని తేల్చి చెబుతోంది. కానీ కొంతమంది చదువులు అయిపోయిన తర్వాత కూడా అక్రమంగా అక్కడే ఉంటున్నారు. వీరుగాక సరిహద్దు ప్రాంతాలైన మెక్సికో(Mexico), కెనడా(Canada) తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తుంటారు. ఇలాంటి వారు అక్కడ బ్రతకడానికి దొంగతనాలు, దోపిడీలు చేస్తుంటారు. ఇష్టానుసారం కాల్పులకు తెగబడుతుండటంతో అమెరికన్ల భద్రత దృష్ట్యా...అక్రమ వలసదారుల పట్ల అగ్రరాజ్యం ఎప్పుడూ కటువుగానే ఉంటుంది. ట్రంప్ రాకతో ఆ ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి.
ఏజెంట్లను నమ్మి మోసపోయారు
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారంతా ఏజెంట్లను నమ్మి మోసపోయినవారే ఎక్కువమంది ఉంటారు.వీసాలు ఇప్పిస్తామని....మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి....అక్రమంగా అమెరికాలో వదిలిపెడుతున్నారు. చిన్నచిన్న పడవల్లో సముద్రాలు, నదులు దాటుకుంటూ...కొండలు, గుట్టల మార్గంలో నడుచుకుంటూ వెళ్లి అత్యంత భద్రత కలిగిన అమెరికా సరిహద్దును దాటాల్సి ఉంటుంది. మార్గమధ్యలో ప్రాణాలు విడిచేవారు ఎంతోమంది ఉంటారు. అమెరికా సరిహద్దు దాటే క్రమంలో భద్రతా దళాలు కంటపడితే కాల్చివేస్తారు. ఇన్ని అడ్డంకులు దాటుకుని అగ్రరాజ్యంలో అడుగుపెట్టినా....అక్కడి అధికారుల తనిఖీల్లో పట్టుబడితే జైలుపాలవ్వడమే.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion