అన్వేషించండి

కంటిచూపు కోల్పోయిన రైతులు,పోలీసులతో ఘర్షణల్లో తీవ్ర గాయాలు

Farmers March: పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు రైతులు కంటి చూపు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.

Farmers Protest: రైతుల ఆందోళనలు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతుల్ని దేశ రాజధాని వరకూ రానివ్వకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే వాళ్లను ఆపేస్తున్నారు. భారీ బారికేడ్‌లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటినీ లెక్క చేయకుండా రైతులు దూసుకొస్తున్నారు. ఆ సమయంలోనే వాళ్లపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది రైతులు గాయపడినట్టు తెలుస్తోంది. కనీసం 100 మంది రైతులు పోలీసులతో జరిగిన ఘర్షణలో గాయపడ్డారని సమాచారం. వీరిలో ముగ్గురు బాధితులు కంటిచూపు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. పంజాబ్ హరియాణా సరిహద్దు ప్రాంతంలో హరియాణా పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన సమయంలోనే రైతులు కంటి చూపు కోల్పోయారు. చాలా మంది రైతులకు ఎముకలు విరిగిపోయాయని, తలగాయాలతో ఆసుపత్రుల్లో చేరారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఘర్షణలు జరుగుతున్నాయి. పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ బల్బీర్ సింగ్ ప్రస్తుత ఉద్రిక్తతలపై స్పందించారు. 

"పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు రైతులు కంటి చూపు కోల్పోయారు. వాళ్లను ప్రస్తుతం హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నాం. అన్ని పరీక్షలు చేయించాం. కంటి చూపు మళ్లీ వచ్చే అవకాశం లేదని వైద్యులు వెల్లడించారు. కేవలం టియర్ గ్యాస్ మాత్రమే. పోలీసులు బులెట్స్ కూడా వినియోగించారు. రైతుల్ని అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. అందుకే ఇలా జరిగింది"

- బల్బీర్ సింగ్, పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి

బులెట్‌లు కళ్లలోకి దూసుకుపోయాయని, వాటి వల్ల కంటి చూపు రైతులు కంటి చూపు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో దాదాపు 250 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ఎక్కువగా పంజాబ్‌కి చెందిన రైతులే ఉన్నారు. బారికేడ్‌లను తొలగించి ఢిల్లీ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు టియర్‌ గ్యాస్‌తో పాటు water cannonsని ప్రయోగించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పింఛన్‌ ఇవ్వడంతో పాటు తమపై ఇప్పటి వరకూ పెట్టిన పోలీస్ కేసులను రద్దు చేయాలన్న డిమాండ్‌లతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget