అన్వేషించండి

CEO Passport : వీసా పాస్‌పోర్టు చోరీ చేసిన ఉద్యోగి - తిరిగిచ్చేయాలని బతిమాలుతున్న బాస్ ! ఇదో విచిత్రమైన కథ

Bengaluru CEO : మాస్ లే ఆఫ్స్ ను ప్రకటించిన సీఈవోకు సీనియర్ ఉద్యోగి షాకిచ్చారు. ఆ సీఈవో పాస్‌ పోర్టు, వీసాను తీసుకెళ్లిపోయాడు.దాంతో ఆ సీఈవో ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.

Ex Employee Stole Bengaluru CEO Passport With US Visa :  ఆ కంపెనీ సీఈవో అమెరికాకు వెళ్లి తన కంపెనీకి అదనపు పెట్టుబడుల కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నారు. కానీ ఆయన పాస్ పోర్ట్, వీసా మాత్రం కనిపించడం లేదు. వెదికి వెదికి చివరికి ఆయనకు తెలిసిందేమిటంటే కంపెనీలో పని చేసిన ఉద్యోగి వాటిని తస్కరించాడని. ఇప్పుడు ఆయనను పిలిచి పాస్ పోస్ట్, వీసా తీసుకు రావాలని అడగలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఉద్యోగిని అంతకు ముందే ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతో కోపం వచ్చి ఆ వీసా పాస్ పోర్టు తీసుకెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలిసిన తర్వాత సీఈవోకు నిద్ర కరువైంది. 

AI స్టార్టప్ ప్రారంభించి ఉద్యోగుల్ని తీసేసిన విశ్వనాథ్                   

బెంగళూరులో సార్తీ AI అనే స్టార్టప్ కంపెనీని విశ్వనాథ్ ఝా ప్రారంభించారు. ఫౌండర్ సీఈవో ఆయనే. ఆయన భారీగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుని పనులు చేశారు. అయితే  నష్టాలు వస్తున్నాయి. దీంతో కంపెనీని లాభాల బాటలో ఉంచడానికి పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించారు. వర్క్ ఫోర్స్ లో సగానికిపైగా ఉద్యోగుల్ని తీసేశారు. ఆ సమయంలోనే సీనియర్ ఉద్యోగి ఒకరు వీసా, పాస్ పోర్టు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు తన కంపెనీకి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే వీసా వచ్చింది. కానీ వీసా, పాస్ పోర్టు రెండూ పోవడంతో ఆయనకు మరో దారి లేకుండా పోయింది. 

వీసా కూడా తీసుకెళ్లడంతో అమెరికా వెళ్లలేని పరిస్థితి

పోయిందని చెప్పి పాస్ పోర్టును కొత్తది పొందిన  వీసా తీసుకోవడం మాత్రం ఆయనకు సాధ్యం కావడం లేదు. భారీ క్యూ ఉండటమే దీనికి కారణమని ఆయన చెబుతున్నారు. తాను మాస్ లే ఆఫ్స్ ప్రకటించింది ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకేనని.. ఉద్యోగులకు కీడు చేయాలని కాదని ఆయన ఓ ఇంటర్యూలో వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం..  ఝాపై చాలా ఆరోపణలు చేశారు. తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని.. తమతో చెడుగా ప్రవర్తించేవారని ఆరోపిస్తూ వచ్చారు. యాభై మంది ఉద్యోగులకు ఏడాది వరకూ జీతాలు ఇవ్వలేదని వారంటున్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకున్నా.. లీగల్ నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించడం లేదంటున్నారు. 

విశ్వనాథ్‌పై ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు                 

గత రెండేళ్ల నుంచి ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఉద్యోగుల టీడీఎస్‌ను కట్టలేదన్న ఆరోపణలను కూడా సీఈవో విశ్వనాథ్ అంగీకరించారు. కంపనీకి చాలా సవాళ్లు ఉన్నాయని వాటన్నింటినీ అధిగమిస్తామని ఆయన అంటున్నారు. ఈ ఏడాదిలో కొత్త పెట్టుబడులు వస్తాయని.. కంపెనీ నడుపుకుంటానని ఆయన ఆశాభవంతో ఉన్నారు. ఆయన ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే.. తన వీసా పత్రాలు తనకు ఇవ్వాలని కోరడానికే.                           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Rapido Driver Selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
Mana Shankara Varaprasad Garu : 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లో విషాదం - మూవీ చూస్తూ కుప్పకూలిన అభిమాని
'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లో విషాదం - మూవీ చూస్తూ కుప్పకూలిన అభిమాని
Embed widget