అన్వేషించండి

CEO Passport : వీసా పాస్‌పోర్టు చోరీ చేసిన ఉద్యోగి - తిరిగిచ్చేయాలని బతిమాలుతున్న బాస్ ! ఇదో విచిత్రమైన కథ

Bengaluru CEO : మాస్ లే ఆఫ్స్ ను ప్రకటించిన సీఈవోకు సీనియర్ ఉద్యోగి షాకిచ్చారు. ఆ సీఈవో పాస్‌ పోర్టు, వీసాను తీసుకెళ్లిపోయాడు.దాంతో ఆ సీఈవో ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.

Ex Employee Stole Bengaluru CEO Passport With US Visa :  ఆ కంపెనీ సీఈవో అమెరికాకు వెళ్లి తన కంపెనీకి అదనపు పెట్టుబడుల కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నారు. కానీ ఆయన పాస్ పోర్ట్, వీసా మాత్రం కనిపించడం లేదు. వెదికి వెదికి చివరికి ఆయనకు తెలిసిందేమిటంటే కంపెనీలో పని చేసిన ఉద్యోగి వాటిని తస్కరించాడని. ఇప్పుడు ఆయనను పిలిచి పాస్ పోస్ట్, వీసా తీసుకు రావాలని అడగలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఉద్యోగిని అంతకు ముందే ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతో కోపం వచ్చి ఆ వీసా పాస్ పోర్టు తీసుకెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలిసిన తర్వాత సీఈవోకు నిద్ర కరువైంది. 

AI స్టార్టప్ ప్రారంభించి ఉద్యోగుల్ని తీసేసిన విశ్వనాథ్                   

బెంగళూరులో సార్తీ AI అనే స్టార్టప్ కంపెనీని విశ్వనాథ్ ఝా ప్రారంభించారు. ఫౌండర్ సీఈవో ఆయనే. ఆయన భారీగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుని పనులు చేశారు. అయితే  నష్టాలు వస్తున్నాయి. దీంతో కంపెనీని లాభాల బాటలో ఉంచడానికి పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించారు. వర్క్ ఫోర్స్ లో సగానికిపైగా ఉద్యోగుల్ని తీసేశారు. ఆ సమయంలోనే సీనియర్ ఉద్యోగి ఒకరు వీసా, పాస్ పోర్టు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు తన కంపెనీకి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే వీసా వచ్చింది. కానీ వీసా, పాస్ పోర్టు రెండూ పోవడంతో ఆయనకు మరో దారి లేకుండా పోయింది. 

వీసా కూడా తీసుకెళ్లడంతో అమెరికా వెళ్లలేని పరిస్థితి

పోయిందని చెప్పి పాస్ పోర్టును కొత్తది పొందిన  వీసా తీసుకోవడం మాత్రం ఆయనకు సాధ్యం కావడం లేదు. భారీ క్యూ ఉండటమే దీనికి కారణమని ఆయన చెబుతున్నారు. తాను మాస్ లే ఆఫ్స్ ప్రకటించింది ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకేనని.. ఉద్యోగులకు కీడు చేయాలని కాదని ఆయన ఓ ఇంటర్యూలో వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం..  ఝాపై చాలా ఆరోపణలు చేశారు. తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని.. తమతో చెడుగా ప్రవర్తించేవారని ఆరోపిస్తూ వచ్చారు. యాభై మంది ఉద్యోగులకు ఏడాది వరకూ జీతాలు ఇవ్వలేదని వారంటున్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకున్నా.. లీగల్ నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించడం లేదంటున్నారు. 

విశ్వనాథ్‌పై ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు                 

గత రెండేళ్ల నుంచి ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఉద్యోగుల టీడీఎస్‌ను కట్టలేదన్న ఆరోపణలను కూడా సీఈవో విశ్వనాథ్ అంగీకరించారు. కంపనీకి చాలా సవాళ్లు ఉన్నాయని వాటన్నింటినీ అధిగమిస్తామని ఆయన అంటున్నారు. ఈ ఏడాదిలో కొత్త పెట్టుబడులు వస్తాయని.. కంపెనీ నడుపుకుంటానని ఆయన ఆశాభవంతో ఉన్నారు. ఆయన ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే.. తన వీసా పత్రాలు తనకు ఇవ్వాలని కోరడానికే.                           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Duster, Creta లేదా Kia Seltos: ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనేముందు ఇవి తెలుసుకోండి
Duster, Creta లేదా Kia Seltos: ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనేముందు ఇవి తెలుసుకోండి
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget