అన్వేషించండి

Duddilla Sridhar Babu: ఈసారి రూ.40 వేల కోట్ల పెట్టబడులు తెలంగాణకు, గతేడాది దాంట్లో సగమే - శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu Comments: సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

Telangana Davos Investments: దావోస్ వేదికగా తెలంగాణకు గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెట్టబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 2023లో కేవలం రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు జరిగాయని, కానీ ఈ సారి ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.40 వేల కోట్ల మేర పెట్టబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, జెడ్డాలో జరిగిన పలు సమావేశాల నేపథ్యంలో  ఒక దిగ్గజ ఫుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సంస్థ భారీ స్థాయిలో రెస్టారెంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని వెల్లడించారు. 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరులో ఉన్న జేసీకే హారిజాన్ ఇండస్ట్రీయల్ పార్కు లో జేహ్ ఏరోస్పేస్ సంస్థను సోమవారం (జనవరి 22) నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తమ బృందం  దాదాపు రూ. 40 వేల కోట్ల మేర పెట్టుబడులకు గానూ ఒప్పందాలపై సంతకాలు చేశామని ప్రకటించారు. ఎనర్జీ, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు సంబంధించిన పరిశ్రలు తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, గత 9 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టబడులకు ఒప్పందాలు చేసుకోవడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. 2023లో కేవలం రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు జరిగాయని, ఈ సారి పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మూడు దశాబ్దాల క్రితం అప్పటి  కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధానాల వల్ల రాష్ట్రంలో ఐటీ రంగం ఊహించనంత స్థాయికి ఎగబాకిందని, ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.
 
విజన్ తో పనిచేస్తున్నామని, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నామని తెలిపారు. ఎరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. తయారీని ప్రోత్సహిస్తే డిమాండ్, పంపిణీకి మధ్య వ్యత్యాసం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా, పశ్చిమ యూరోప్ లో ఉన్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీ కేంద్రాలతో పోటీ పడే విధంగా ఏఐ టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెజలిటీలు భారత్ లో ఉంటాయని వివరించారు.  

అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు రాష్ట్రంలో మొదట వృద్ది చెందే రంగాలని పేర్కొన్నారు. కాబట్టి ఈ రంగంలో పెట్టుబడులను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అన్నారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తూ జేహ్ ఏరోస్పేస్ సంస్థ విజయం సాధించాలని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుందని తెలియజేశారు. 2.7 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్ల) మేర సీడ్ రౌండ్ నిధులు సాధించినందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే
నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే
నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి 
చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి 
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Numaish Exhibition 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
Embed widget