అన్వేషించండి

Modi In Loksabha: రాజ్యాంగాన్ని చెరబట్టింది కాంగ్రెస్ పార్టీనే - చరిత్రను తవ్వి కడిగిపారేసిన ప్రధాని మోదీ

Modi Speech: రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చడమే కాదు .. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాల రాసింది కూడా కాగ్రెస్ పార్టీనేనని ప్రధాని మోదీ విమర్శించారు. లోక్ సభలో మోదీ ప్రసంగించారు.

PM Modi Slams Gandhi Family: రాజ్యాంగంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నెహ్రూ హయాంలోనే రాజ్యాంగానికి తూట్లు పొడిచారని .. ఇష్టం వచ్చినట్లుగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సవరణలు చేశారని అన్నారు. ఇందిగాంధీ హయాలంలో రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ..ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. నెహ్రూ దొంగ చాటుగా రాజ్యాంగాన్ని సవరించారని..సొంత రాజ్యాంగాన్ని నడిపారన్నారు. ఎంతో మంది పెద్దలు అలా చేయవద్దని సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సవరణలు చేశారని గుర్తు చేశారు. 1971లో ఇందిరాగాంధీ.. సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇందిర ఎన్నికలను రద్దు చేయడంతో ఈ చర్యకు ప్రయత్నించారని.. ప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పరిపాలించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదని..మా పాలన చూసి ప్రజలు మూడు సార్లు అధికారం ఇచ్చారన్నారు.  

కానీ భారత రాజ్యాంగం.. కాంగ్రెస్ పార్టీ , గాంధీ కుటుంబం చేసిన దాడిని తట్టుకుందన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివని ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని..  ఎందరో మహానుభావులు కలిసి రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేసారు. ఇలాంటి కీలక సమయంలో పార్లమెంట్‌లో తాను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారతదేశ భవిష్యత్‌పై కలిగిన సందేహాలు, సవాళ్లను అధిగమించి.. భారత రాజ్యాంగం మనలను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని... ఇది నిజంగా అద్భుత విజయం అని స్పష్టం చేశారు. 

రాజ్యాంగ నిర్మాతలతో పాటు.. కోట్లాది మంది భారతీయులకు మోదీ గౌరవ వందనం ప్రకటించారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదని.. వేలాది సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయాల కారణంగా ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందని ప్రకటించారు. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర షోషిస్తోంని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారన్నారు.    

1950లోనే భారతదేశం ప్రజాస్వామ్యం దేశం అవుతుందని నమ్మలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశ గణతంత్రం గతం చాలా గొప్పదన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని మోదీ గర్వంగా ప్రకటించారు. భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 75 ఏళ్ల రాజ్యాంగ యాత్ర ఓ గొప్ప ప్రయాణమని అన్నారు.          

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu at IIT Madras:  మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
IPL 2025: ధోనీపై ఉన్నది అభిమానం కాదు ప్రమాదం? సీఎస్కేకు రాయుడు హెచ్చరిక  
ధోనీపై ఉన్నది అభిమానం కాదు ప్రమాదం? సీఎస్కేకు రాయుడు హెచ్చరిక  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu at IIT Madras:  మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు క్రేజ్ - ఉన్నత చదువులు అభ్యసించేవారిలో సీబీఎన్‌ ఇమేజ్ ఇదే
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
IPL 2025: ధోనీపై ఉన్నది అభిమానం కాదు ప్రమాదం? సీఎస్కేకు రాయుడు హెచ్చరిక  
ధోనీపై ఉన్నది అభిమానం కాదు ప్రమాదం? సీఎస్కేకు రాయుడు హెచ్చరిక  
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Earthquake Today :12 నిమిషాల్లో రెండు భీకర భూకంపాలు- బ్యాంకాక్ నుంచి దిల్లీ వరకు కంపించిన భూమి
12 నిమిషాల్లో రెండు భీకర భూకంపాలు- బ్యాంకాక్ నుంచి దిల్లీ వరకు కంపించిన భూమి
Nara Lokesh: 11 ఏళ్ల అఖిల్‌ను పిలిపించుకుని అభినందించిన లోకేష్- ఈ చిచ్చర పిడుగు టాలెంట్ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!
11 ఏళ్ల అఖిల్‌ను పిలిపించుకుని అభినందించిన లోకేష్- ఈ చిచ్చర పిడుగు టాలెంట్ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Embed widget