అన్వేషించండి

Congress : బీజేపీలోకి 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ దుకాణం బంద్ ? - కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

Pargat Singh : ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీని ప్రభావం పక్క రాష్ట్రం పంజాబ్ పై పడింది. పంజాబ్‌లో ఆ పార్టీకి కొత్త చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Delhi Assembly Elections 2025 : ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఆ పార్టీ అధికారంలో ఉన్న పక్క రాష్ట్రం పంజాబ్ పై పడింది. పంజాబ్‌లో ఆ పార్టీకి కొత్త చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత  ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీలోని కనీసం 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ఓటమి అనంతరం ఆప్ లో పెరుగుతున్న అసంతృప్తి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 70 స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుని 27 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. మరోవైపు, ఆప్ తన సొంత గడ్డ అయిన ఢిల్లీలో ఘోర పరాజయం పాలై, ఒక దశాబ్దం పైగా కొనసాగిన తన పాలనకు ముగింపు పలికింది.  ఈ ఫలితాల ప్రభావం పంజాబ్ రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని పరగత్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆప్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఢిల్లీ మోడల్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆ మోడల్‌ను నమ్మి పంజాబ్‌లో అధికారం లోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

భగవంత్ మాన్ భవిష్యత్తుపై అనుమానాలు
కాంగ్రెస్ నేత  ప్రతాప్ సింగ్  బజ్వా వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ స్పందించారు. అయితే, 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే అంశాన్ని ఖచ్చితంగా ధృవీకరించలేమని, ఆ విషయాన్ని బజ్వానే స్పష్టీకరించాల్సి ఉంటుందని అన్నారు. అయితే, భగవంత్ మాన్ ప్రస్తుతానికి పూర్తిగా నియంత్రిత ముఖ్యమంత్రిగా మారిపోయారని, ఆయన నిజంగా అధికారంలో లేరని, అన్ని కీలక నిర్ణయాలు ఢిల్లీలోనే తీసుకుంటున్నారని పరగత్ సింగ్ ఆరోపించారు.

ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. భగవంత్ మాన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో టచ్‌లో ఉన్నారనే సంకేతాలు ఉన్నాయని మరో బాంబు పేల్చారు. ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 95 సీట్లు గెలుచుకుని 46శాతం ఓటు షేర్ సాధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 26-27శాతం వరకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆప్ కు పంజాబ్‌లో రాబోయే రోజులు మరింత కష్టంగా మారనున్నాయని బజ్వా అంచనా వేశారు.

 

Also Read : Delhi CM Atishi Resigns: ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి, సైలెంట్‌గా వెళ్లిపోయిన అతిషీ - వీడియో వైరల్

పంజాబ్, బెంగాల్‌లో బీజేపీకి పెద్ద సవాలు
బీజేపీ నేత జితేంద్ర చేసిన వ్యాఖ్యలపై కూడా పరగత్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో విజయం సాధించిన బీజేపీ, ఇంకా ఇతర రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతుండటాన్ని ఆయన వ్యంగ్యంగా తీసుకున్నారు. పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని, ఆ రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీ విధానాలను అస్సలు అంగీకరించరని పేర్కొన్నారు.

ఓటు శాతం పెరిగినా కాంగ్రెస్ కు నిరాశే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవలేకపోయినా, గత ఎన్నికలతో పోల్చితే పార్టీ ఓటు శాతం పెరిగిందని పరగత్ సింగ్ తెలిపారు. కనీసం 8-10 సీట్లు గెలుస్తామనే అంచనాలు పెట్టుకున్నా, ఫలితంగా పూర్తిగా నిరాశ ఎదురైందని చెప్పారు.

సంప్రదాయ రాజకీయ పార్టీలకు కొత్త సవాలు
పంజాబ్‌లో ఇప్పుడు ఆప్ కష్టాల్లో పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ గణనలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ ప్రజలు ఆప్ కు ఇచ్చిన మెజార్టీ తిరిగి సమీక్షించే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో పంజాబ్ రాజకీయ వాతావరణం ఎటువైపు తిరుగుతుందో చూడాలి.

 

Also Read :Delhi Results: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, సంతోషంగా లేని ఎన్డీయే మిత్రపక్షాలు - రీజన్ ఏంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget