అన్వేషించండి

Congress Foundation Day: జోడో యాత్రతో కాంగ్రెస్‌కు కొత్త లైఫ్ వచ్చింది, బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది - ఖర్గే

Congress Foundation Day: కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

Congress 138th Foundation Day:

138వ వ్యవస్థాపక దినోత్సవం..

138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌ను అందంగా అలంకరించారు. పార్టీ సీనియర్ నేతలంతా ఇక్కడే ఉన్నారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. ఇంత జరుగుతున్నా...కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. "భారతీయ స్ఫూర్తిపైనే కేంద్రం దాడి చేస్తోంది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసింది. అందుకే ప్రతిపక్షాలు అలా ఆందోళనకు గురవుతున్నాయి. జోడో యాత్రకు వచ్చిన మద్దతు చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు" అని వ్యాఖ్యానించారు ఖర్గే. పదేపదే యాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 1855లో బాంబే వేదికగా డిసెంబర్ 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. దాదాబాయ్ నౌరోజీ, దిన్షా వచా పార్టీని స్థాపించగా...మిగతా కార్యకలాపాలాన్నీ వుమేష్ చంద్ర బెనర్జీ చూసుకున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక INC పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..

కాంగ్రెస్‌పై బీజేపీ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఆ పార్టీది అవినీతి చరిత్ర అంటూ ఎప్పుడూ మండి పడుతూనే ఉంటుంది. ఇటీవల బీజేపీ మరోసారి కాంగ్రెస్ కుంభకోణాలను ఏకరవు పెడుతోంది. బోఫోర్స్‌ స్కామ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చి విమర్శలు చేసింది. ఆర్మీకి అందించే తుపాకుల విషయంలో అవినీతికి పాల్పడిందని మండి పడింది. తుపాకుల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని వెల్లడించింది. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్‌ కుంభకోణం జరిగిందని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అప్పట్లో భారత్ 400 హోవిట్జర్ గన్స్‌ కొనుగోలు చేసేందుకు రూ.1,437 కోట్లు కేటాయించింది. అయితే...1987లో ఈ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. ఫోర్జరీ కేసు కింద రాజీవ్ గాంధీ సన్నిహితుడైన ఒట్టావియో పై FIR నమోదైంది. పీవీ నరసింహా రావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన నిందితుడైన ఒట్టావియోను దేశం దాటించిందని ఆరోపించింది. ఆ తరవాత 1999లో సీబీఐ నిందితుడిపై చార్జ్‌షీట్‌  దాఖలు చేసింది. ఒట్టావియో తన నేరాన్ని అంగీకరించినట్టు, 7 మిలియన్ డాలర్ల మేర అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టు అందులో పేర్కొంది. దీనిపై బీజేపీ అప్పట్లో కాంగ్రెస్‌పై పోరాటం చేసింది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించింది. బోఫోర్స్ కుంభకోణంపై పిటిషన్ దాఖలు చేసింది. భారత్‌కు చెందిన బడా వ్యాపారి ఒట్టావియోకి ఈ డీల్‌లో పెద్ద మొత్తంలో కమిషన్ అందినట్టు ఆరోపణలొచ్చాయి. అయితే...కాంగ్రెస్ మాత్రం ఈ స్కామ్‌ జరగలేదని వాదించింది. 2004లో సీబీఐ విచారణ జరిపి...రాజీవ్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చింది.  

Also Read: New Year 2023: న్యూ ఇయర్ పార్టీలతో జాగ్రత్త, ఎక్కడ పడితే లిక్కర్ కొనకండి - అధికారుల సూచనలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget