అన్వేషించండి

Madya Pradesh: మధ్యప్రదేశ్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల విగ్రహం

Madya Pradesh: మధ్యప్రదేశ్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 'ఏకాత్మా కి ప్రతిమ' లేదా 'స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌' (Statue of Oneness) అని నామకరణం చేశారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజసింగ్‌ చౌహాన్‌ ఈరోజు ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి  'ఏకాత్మా కి ప్రతిమ' లేదా 'స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌' (Statue of Oneness) అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇది ఆదిశంకరాచార్యుల వారి వారసత్వానికి, వారి బోధనలకు స్మారక నివాళిగా నిలుస్తుందని చౌహాన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ విగ్రహం సెప్టెంబరు 18వ తేదీనే ఆవిష్కరించాల్సి ఉండగా ఆ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 21వ తేదీన ఆవిష్కరణ చేశారు. 

విగ్రహావిష్కరణ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. "స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌ ప్రపంచానికి శాంతి సందేశం అందిస్తుంది. అంతా భగవంతుడి ఆశీస్సుల వల్లే జరుగుతుంది. భారతదేశ విజ్ఞానం, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. భరత వర్షంగా పిలిచే ఈ భూమిని ఏకీకృతం చేయడానికి శంకరాచార్యులు కృషి చేశారు. అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా వ్యూహాత్మకంగా నాలుగు ఆధ్యాత్మిక మఠాలను స్థాపించడంలో ఆయన పాత్ర కీలకం" అని శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌ పట్టణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహంతో పాటు మ్యూజియం నిర్మించేందుకు భారతీయ జనతా పార్టీ రూ.2,141,85కోట్ల రూపాయలు కేటాయించింది.

ఖాండ్వా జిల్లాలో నర్మదా నదికి అభిముఖంగా ఉన్న సుందరమైన మాంధాత కొండపై ఈ విగ్రహ నిర్మాణం చేశారు. ఆచార్య శంకర సంస్కృతిక ఏక్తా న్యాస్‌ మార్గదర్శకత్వంలో మధ్యప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆదిశంకరాచార్య తత్వాన్ని చాటి చెప్పడంతో పాటు ఏకత్వం భావనను నొక్కి చెప్పేందుకు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్‌ వన్‌నెస్‌ అని పేరు పెట్టారు.

ఈ ప్రాజెక్టు మానేజింగ్‌ ప్రిన్సిపల్ దీక్షు కుక్రేజా మాట్లాడుతూ..'ఇది చాలా అద్భుతమైన కట్టడం. ఆదిశంకరాచార్యుల వారి జీవితాన్ని, తత్వాన్ని గౌరవించేలా దీనిని రూపొందించాం. బ్రహ్మసూత్ర భాష్యపై అద్భుతమైన వ్యాఖ్యానాలు చెప్పిన గొప్ప సాధువుకి ఇది గొప్న నివాళి. ఈ సాంస్కృతిక ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వసుదైక కుటుంబం ఆలోచనలో భాగం. ఈ 108 అడుగుల ఎత్తైన విగ్రహంతో మధ్యప్రదేశ్‌ అన్ని మతాలకు, సాంస్కృతికతకు ఆధ్యాత్మిక కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది' అని తెలిపారు.

ఈ ప్రాజెక్టును 2018లో ప్రారంభించారు. తొలుత షోలాపూర్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు వాసుదేవ్‌ కామత్‌ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహానికి చిత్రపటాన్ని రూపొందించారు. అనంతరం ఏకాత్మ యాత్ర పేరుతో భారీ బహిరంగ ర్యాలీలు, ఊరేగింపులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. సుమారు 23000 గ్రామ పంచాయతీలలో ర్యాలీ  చేపట్టి లోహాలను సేకరించారు. ఆ లోహంతో విగ్రహ తయారీ చేపట్టారు. ఈ ప్రాజెక్టు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యానికి ఉదాహరణ కూడా. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Oscar Academy: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Oscar Academy: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
Vishwambhara Song Promo: మెగాస్టార్ విశ్వంభర 'రామ రామ' సాంగ్ ప్రోమో రిలీజ్ - గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!
మెగాస్టార్ విశ్వంభర 'రామ రామ' సాంగ్ ప్రోమో రిలీజ్ - గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
Viral News: పెళ్లి వేడుకలో కాంగ్రెస్ హామీలపై వినూత్న నిరసన, తులం బంగారం ఎక్కడ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన
పెళ్లి వేడుకలో కాంగ్రెస్ హామీలపై వినూత్న నిరసన, తులం బంగారం ఎక్కడ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన
Embed widget