అన్వేషించండి

Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'

భారత్- చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణలో డ్రాగన్ సైన్యంలో జరిగిన ప్రాణ నష్టం అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువని తాజాగా ఓ వార్తాపత్రిక వెల్లడించింది.

2020లో చైనా- భారత్ జవాన్ల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణపై తాజాగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పత్రిక. ఆ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్య డ్రాగన్ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని తేల్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ న్యూస్ పేపర్ క్లాక్సన్ ఈ నివేదికను ప్రచురించింది.

Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ

నలుగురే..

గల్వాన్ ఘర్షణ జరిగిన దాదాపు ఎనిమిది నెలల తర్వాత అంటే 2021 ఫిబ్రవరిలో చైనా ప్రభుత్వం చనిపోయిన నలుగురు జవాన్లకు మెడల్స్ ప్రకటించింది. ఈ నలుగురే గల్వాన్ ఘర్షణలో చనిపోయారని చెప్పుకొచ్చింది. కానీ ఈ పరిశోధాత్మక వార్తా పత్రిక కథనం ప్రకారం.. ఆ రోజు గల్వాన్ ఘర్షణలో చాలా మంది చైనా జవాన్లు.. చీకట్లో సబ్ జీరో నది దాటుతూ అందులో మునిగిపోయి చనిపోయారని తేలింది. ఈ ఘటనపై చైనా అంతర్గతంగా తీవ్రంగా చర్చించినట్లు కూడా కథనం పేర్కొంది.

గల్వాన్ ఘర్షణ..

లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్- చైనా దేశాల మధ్య ఒక్కసారిగా ఘర్షణలు జరిగాయి. రెండు దేశాల సైనికులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే, దీనికి నెల రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2020 మే 21న భారత సైన్యం సరిహద్దులు దాటుతోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా స్పందించారు. రోజువారీగా భారత్ చేపట్టే గస్తీ విధులకు చైనా సైన్యమే అడ్డు తగిలిందని అనురాగ్ చెప్పారు.

2020 జూన్ 6న లద్దాఖ్‌లో భారత్, చైనా దౌత్యవేత్తలు, సైనిక కమాండర్లు ఈ విషయంపై చర్చలు జరిపారు. ఆ తర్వాత పలు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ చర్చలు జరిపారు.

ఇదిలా ఉండగానే లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని 2020 జూన్ 16న భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. జూన్ 15న విధ్వంసకర ఘర్షణలు జరిగాయి. రెండు వైపులా మరణాలు నమోదైనట్లు భారత్ తెలిపింది. 

చైనా వైపు 45 మందికిపైగా మరణించారని భారత ప్రభుత్వం అప్పుడే చెప్పింది. కానీ చైనా దీనిని బుకాయించింది.

Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా 1,72,433 మందికి కరోనా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Pawan Kalyan Padala Maruti Suzuki Victoris: బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Embed widget