By: Ram Manohar | Updated at : 21 Dec 2022 04:08 PM (IST)
చైనా ప్రభుత్వం కొవిడ్ మరణాలకూ నిర్వచనం మార్చేసింది.
China Corona Deaths:
కొత్త నిబంధన..
చైనాలో కొవిడ్ విజృంభణ మళ్లీ మొదలైంది. ఎప్పటిలాగే అక్కడి ప్రభుత్వం లెక్కలు దాచి పెడుతోంది. ఎంత మందికి కరోనా సోకుతోంది..? ఎంత మంది చనిపోతున్నారు..? అనే వివరాలు సరిగా వెల్లడించడం లేదు. ఈ విషయంలో ఎప్పటి నుంచో చైనాపై ప్రపంచవ్యాప్తంగా అసహనం వ్యక్తమవుతూనే ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే...జిన్పింగ్ ప్రభుత్వం ఇప్పుడు "మరణానికి నిర్వచనం"మార్చేసింది. ఈ నిబంధన ప్రకారం..ఎవరైనా శ్వాస సంబంధింత సమస్యలతో మరణిస్తేనే వారిని "కొవిడ్ మృతుల" జాబితాలో చేర్చుతారు. కరోనా కారణంగా మిగతా ఎలాంటి ఇబ్బంది కలిగి చనిపోయినా...వాటిని కరోనా మరణాలుగా పరిగణించరు. ఇప్పటికే చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతుండగా...ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. ఇక అక్కడి ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలా డిపోతున్నాయి. అక్కడి అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..డిసెంబర్ 20న కేవలం ఇద్దరు మాత్రమే కొవిడ్ కారణంగా చనిపోయారు. అంతకు ముందు రోజు కూడా ఇద్దరే మరణించారని లెక్కలె చెప్పారు. అయితే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మాత్రం శ్మశానాల వద్ద భారీ సంఖ్యలో శవాలను పేర్చి పెట్టారని వార్త రాసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, అక్కడి పరిస్థితులు ఏ పొంతనా కుదరడం లేదు. ట్విటర్లో అక్కడి పరిస్థితులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. చైనీస్ బ్లాగర్ ఒకరు ఈ వీడియోలు పోస్ట్ చేశారు. కొన్ని ఆసుపత్రుల్లోని మార్చురీల్లో కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మరో వీడియోలో ఓ వ్యక్తి కరోనా సోకి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యం కోసం చూసి చూసి ఓపిక లేక కిందపడిపోయాడు. ఆ బాధితుడికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A patient collapsed in a hospital in #CCPChina. Obviously, no doctor came to check on him.
Collapsing of the medical system is another consequence of the #CCP's irresponsible "lying flat" policy.
#ZeroCOVIDpolicy #COVID19 #CCPVirus #AmazingChina #COVID #ZeroCovid
#XiJinping pic.twitter.com/NZNtqBn9dI— Jennifer Zeng 曾錚 (@jenniferzeng97) December 19, 2022
At China-Japan Friendship Hospital in #Beijing, man counts how many bodies are in the corridor: 1,2,3...19.#chinalockdown #ZeroCOVIDpolicy#CCPChina #COVID19 #CCPVirus #AmazingChina #COVID #ZeroCovid#lockdown #XiJinping #CCP #China pic.twitter.com/kFauRG31cT
— Jennifer Zeng 曾錚 (@jenniferzeng97) December 19, 2022
భయపడాల్సిన పని లేదు..
చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. కేంద్రఆరోగ్య మంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా...భారత్ ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. "భారత్లో వ్యాక్సినేషన్ కవరేజ్ రికార్డు స్థాయిలో ఉంది. భయపడాల్సిన పని లేదు" అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. "చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. కానీ...మన దేశంలో వ్యాక్సినేషన్ కవరేజ్ చాలా బాగుంది. అందుకే భయపడాల్సిన పని లేదు. భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచాలి. జాగ్రత్తలూ పాటించాలి" అని ట్వీట్ చేశారు అదర్ పూనావాలా.
Also Read: Viral Video: నేను మీ సర్వెంట్ను కాదు, ప్రయాణికుడిపై ఎయిర్హోస్టెస్ అసహనం - వైరల్ వీడియో
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
SSC CHSLE 2022 Key: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్