అన్వేషించండి

Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Kolkata Protests: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రతి రెండు గంటలకోసారి శాంతి భద్రతలపై అప్‌డేట్ ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Kolkata Doctor Case: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసింది. పలు రాష్ట్రాల్లో వైద్యులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమైంది. మహిళా వైద్యుల భద్రతకు సంబంధించి ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రతి రెండు గంటలకోసారి అప్‌డేట్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిపోర్ట్స్ పంపుతున్నట్టు సమాచారం. ఆగస్టు 16వ తేదీ నుంచే ఈ నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అధికారికంగా హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి రిపోర్ట్‌ని సరైన సమయానికి పంపించాలని చాలా గట్టిగా చెప్పింది. కోల్‌కత్తా డాక్టర్‌ కేసులో ఎక్కడో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సమస్యని తీర్చేందుకే రిపోర్ట్‌లు పంపించాలని కేంద్రం ఆదేశించింది. 

ఆగస్టు 9వ తేదీన కోల్‌కత్తాలో ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌ అర్ధనగ్నంగా సెమినార్‌ హాల్‌లో శవమై కనిపించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. ఆమెపై అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఆ అత్యాచారం జరిగిన తీరు కూడా అందరిలోనూ ఆగ్రహం పెంచింది. వైద్యులు తమకు భద్రత కల్పించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌లు వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘటనను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే...శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రే ఇలా ర్యాలీ చేయడమేంటని అంతా మండి పడుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తామే ర్యాలీ చేసుంటారా అంటూ కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. "మీరే సీఎం అన్న సంగతి మర్చిపోయారా" అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే...సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలన్న డిమాండ్‌తోనే దీదీ ర్యాలీ చేశారని ఆ పార్టీ సీనియర్ నేతలు క్లారిటీ ఇచ్చారు.  

 

Also Read: Doctor Abused: డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై వేధింపులు, మద్యం మత్తులో వచ్చి దాడి చేసిన పేషెంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Haryana Polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
AAP నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడికి  280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
KTR: సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
Delhi Liquor Case  : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి   బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
Embed widget