అన్వేషించండి

Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Kolkata Protests: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రతి రెండు గంటలకోసారి శాంతి భద్రతలపై అప్‌డేట్ ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Kolkata Doctor Case: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసింది. పలు రాష్ట్రాల్లో వైద్యులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమైంది. మహిళా వైద్యుల భద్రతకు సంబంధించి ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రతి రెండు గంటలకోసారి అప్‌డేట్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిపోర్ట్స్ పంపుతున్నట్టు సమాచారం. ఆగస్టు 16వ తేదీ నుంచే ఈ నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అధికారికంగా హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి రిపోర్ట్‌ని సరైన సమయానికి పంపించాలని చాలా గట్టిగా చెప్పింది. కోల్‌కత్తా డాక్టర్‌ కేసులో ఎక్కడో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సమస్యని తీర్చేందుకే రిపోర్ట్‌లు పంపించాలని కేంద్రం ఆదేశించింది. 

ఆగస్టు 9వ తేదీన కోల్‌కత్తాలో ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌ అర్ధనగ్నంగా సెమినార్‌ హాల్‌లో శవమై కనిపించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. ఆమెపై అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఆ అత్యాచారం జరిగిన తీరు కూడా అందరిలోనూ ఆగ్రహం పెంచింది. వైద్యులు తమకు భద్రత కల్పించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌లు వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘటనను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే...శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రే ఇలా ర్యాలీ చేయడమేంటని అంతా మండి పడుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తామే ర్యాలీ చేసుంటారా అంటూ కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. "మీరే సీఎం అన్న సంగతి మర్చిపోయారా" అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే...సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలన్న డిమాండ్‌తోనే దీదీ ర్యాలీ చేశారని ఆ పార్టీ సీనియర్ నేతలు క్లారిటీ ఇచ్చారు.  

 

Also Read: Doctor Abused: డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై వేధింపులు, మద్యం మత్తులో వచ్చి దాడి చేసిన పేషెంట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Beauty tech hub in Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ, ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ ప్రకటన
హైదరాబాద్‌లో ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ, ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ ప్రకటన
Embed widget