అన్వేషించండి

IAS IPS KCR Letter: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !

రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం కేంద్రం రూల్స్ మార్చాలని నిర్ణయించుకుంది. దీన్ని బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తక్షణం నిర్ణయం మార్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారు.


సివిల్ సర్వీస్ అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఎవరినైనా ఢిల్లీకి పిలిపించుకునేలా క్యాడర్ రూల్స్‌ను కేంద్రం మార్చాలని నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తాము నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానేమంత్రి మోడీకిలేఖ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అసలు ఆలిండియా సర్వీస్ రూల్స్ ఎందుకు మారుస్తున్నారు..? రాష్ట్రాలకు ఇబ్బందేంటి ? 

Also Read: 'భాజపాతో స్నేహం చేసి 25 ఏళ్లు వేస్ట్ చేశాం.. ఇక గల్లీ రాజకీయాలు కాదు దిల్లీయే లక్ష్యం'

కొత్త మార్పులతో కేంద్రం గుప్పిట్లోకి సివిల్ సర్వీస్ అధికారులు !

సివిల్ సర్వీస్ కేడర్‌ రూల్స్‌లో కేంద్రం నాలుగు మార్పులు  ప్రతిపాదించింది. కావాల్సిన అధికారిని స్వయంగా వెనక్కి పిలిపించుకోవడం, ఎంత మందినైనా తీసుకోవడం.. అధికారుల విషయంలో కేంద్రం మాటే ఫైనల్ కావడం .. కేంద్రం అడిగితే మరో మాట లేకుండా అధికారిని పంపాల్సిందే  అన్న నాలుగు సవరణలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర కేడర్‌కు చెందిన సివిల్ సర్వీస్ అధికారినికేంద్రానికి పంపాలంటే రాష్ట్రం నిరభ్యంతరపత్రం ఇవ్వాలి. ఒక రాష్ట్రం నుంచి 40శాతం మందికి మించి కేంద్రానికి డెప్యుటేషన్‌ మీద వెళ్లకూడదనే నిబంధన ఇప్పటి వరకూ ఉంది. ఇక ముందు ఉండదు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే రాష్ట్రాలు ఆమోదం తెలపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. 

ఆరు రాష్ట్రాలు వ్యతిరేకం.. మిగిలిన రాష్ట్రాల నుంచి స్పందన లేదు !

కేడర్‌ రూల్స్‌ మార్పులపై గత ఏడాది కేంద్రం మూడు సార్లు ప్రతిపాదనలు పంపిది. కానీఆరు రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ స్పందించాయి. మిగిలిన రాష్ట్రాలు సమర్థించలేదు.. వ్యతిరేకించలేదు. తాజాగా రిమైండర్ పంపిన కేంద్రం జనవరి 25 వరకు గడువు ఇచ్చింది.ఈసారి కూడా రాష్ట్రాలు స్పందించకపోతే మరోసారి రిమైండర్‌ పంపించి, ఆ తర్వాత ఏకంగా కొత్త నిబంధనలను నోటిఫై చేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ ప్రభుత్వాలున్న చోట వ్యతిరేకించలేరు. బీజేపీకి సానుకూలమైన పార్టీలు కూడా వ్యతిరేకించడం లేదు. 

కేసీఆర్ సహా 9 రాష్ట్రాల వ్యతిరేకత ..  నేరుగా మోడీకి లేఖ !

తెలంగాణ సీఎం  కేడర్ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మోడీకిలేఖ రాశారు. నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇదే విధంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా లేఖ రాశారు. కేరళ , బిహార్‌లో బీజేపీ  భాగస్వామ్య ప్రభుత్వం,  జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల్లో  సివిల్ సర్వీస్ అధికారులను నియంత్రించే ఉద్దేశంతోనే ఇలా చేస్తన్నారని పార్టీలు అనుమానిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్

రాష్ట్రాల హ్కకులను హరించే ప్రయత్నమని విమర్శలు !
 
 బెంగాల్‌కు వరదలు వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ముఖ్యమంత్రి మమత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ హాజరు కాలేదు. దాంతో ఆగ్రహించిన కేంద్రం ఆయన్ను మే 31న పదవీ విరమణ రోజున డిప్యుటేషన్‌ మీద ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది. ఆయన్ను పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి కారణం అధికారుల్ని కేంద్రానికి పంపాలా లేదా అన్న రాష్ట్రాల ఇష్టం. ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ముందు ముందు మరింత రాజకీయ దుమారానికి కారణం అయ్యే అవకాశం ఉంది. 
  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
IMD Temperature Alert: ఈ ఏడాది సైతం రికార్డు ఉష్ణోగ్రతలు, భానుడి ప్రతాపానికి మార్చి నుంచే వడగాల్పులు: ఐఎండీ
ఈ ఏడాది సైతం రికార్డు ఉష్ణోగ్రతలు, భానుడి ప్రతాపానికి మార్చి నుంచే వడగాల్పులు: ఐఎండీ
Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
Bianca Censori: గ్రామీ అవార్డులలో న్యూడ్ ఫోజులిచ్చిన బియాంకా ఎవరు? కాన్యే వెస్ట్ రెండో భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
గ్రామీ అవార్డులలో న్యూడ్ ఫోజులిచ్చిన బియాంకా ఎవరు? కాన్యే వెస్ట్ రెండో భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Embed widget