అన్వేషించండి

West Bengal: మమతకు హైకోర్టు షాక్- ప్రభుత్వం జారీ చేసిన ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

West Bengal : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

 
West Bengal : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ( OBC) సర్టిఫికెట్లను రద్దు చేసింది. ఈ విధంగా ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వెనుకబడిన తరగతుల కమిషన్ సలహాలు పాటించకుండా ఈ సర్టిఫికెట్లు జారీ చేశారని, అందుకే ఆ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేస్తున్నామని కోర్టు పేర్కొంది. అయితే ఈ కాలంలో జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగం పొందిన వారు తమ ఉద్యోగాలను కొనసాగించాలని కోర్టు పేర్కొంది.

దీని వల్ల దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది. అయితే, 2010కి ముందు ప్రకటించిన ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 2011లో పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టినప్పటి నుండి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ ప్రభుత్వం దాదాపు ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చింది. ముస్లిం సమాజంలోని అధిక జనాభా ఈ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె  పదేపదే దీనిని పునరావృతం చేశారు, అయితే ఇప్పుడు కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వం 2011 నుండి ఓబీసీ సర్టిఫికేట్‌లను జారీ చేసిన ప్రక్రియ చట్టవిరుద్ధమని పేర్కొంది.

కాగా, ఈ ఓబీసీ సర్టిఫికెట్‌ ను అడ్డం పెట్టుకుని  చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు.  అలా ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తింది, దీని పై కలకత్తా హైకోర్టు స్పందించింది. 2010 తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు లేక రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఉద్యోగాలు పొందిన వారి జాబ్స్ అలాగే ఉంటాయని కోర్టు పేర్కొంది.

ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు 
కలకత్తా హైకోర్టు ఆదేశం ప్రకారం..  2010 తర్వాత చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేయబడతాయి. దీని వల్ల రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది. అయితే, 2010కి ముందు ప్రకటించిన ఓబీసీ కేటగిరీ వ్యక్తుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని కలకత్తా హైకోర్టు పేర్కొంది. దీనితో పాటు 2010 తర్వాత ఓబీసీ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు పొందిన వారు లేదా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉన్నవారు కూడా అర్హతను కలిగి ఉంటారు. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ చట్టం, 1993 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ జాబితాను శాసనసభ ఆమోదించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతే దీన్ని అమలు చేయడానికి వీలుంటుంది. 

ఉద్యోగాలు పొందిన వారి ప్రభావం ఉండదు 
2010 తర్వాత చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు పూర్తిగా చట్టానికి లోబడి లేవని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఈ నిర్ణయం తర్వాత ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై గతంలో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగం పొందిన వారికేనని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ నిర్ణయం వారిపై ఎలాంటి ప్రభావం చూపదు. ఉద్యోగం పొందే ప్రక్రియలో ఉన్న వారిపై కూడా కోర్టు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు.  కోర్టు సూచనల మేరకు పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ ఇప్పుడు మళ్లీ ఓబీసీల కొత్త జాబితాను సిద్ధం చేస్తోంది. ఆ జాబితాను అసెంబ్లీలో సమర్పించి, అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతే అమలు చేస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget