News
News
X

BS Yediyurappa Retirement: రాజకీయాలకు యడియూరప్ప గుడ్‌బై, రిటైర్ అవుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటన

BS Yediyurappa Retirement: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రకటించారు.

FOLLOW US: 
Share:

BS Yediyurappa Retirement:

ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను: యడియూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. 

"రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ బీజేపీ గెలుపు కోసం నా ఊపిరున్నంత వరకూ పని చేస్తాను. బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. ఇది కచ్చితంగా జరిగి తీరుతుందని నమ్ముతున్నాను" 

- యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 

కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే యడియూరప్ప చివరిసారి ప్రసంగించి ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే...అంతకు ముందే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని ముందే చెప్పానని, కానీ పార్టీ కోసం కచ్చితంగా పని చేస్తానని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అధికారికంగా ఈ విషయం చెప్పారు. ఫేర్‌వెల్ స్పీచ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1988 నుంచే కర్ణాటక బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు యడియూరప్ప. అప్పటికే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

"చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు పదేపదే విమర్శించాయి. బీజేపీ నన్ను పక్కన పెట్టేసిందని అన్నాయి. వారందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే. నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఇలాంటి అవకాశం మరే నేతకూ దక్కలేదు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను" 

- యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 

యడియూరప్ప ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట్లాడారని కొనియాడారు. ట్విటర్‌లో కన్నడలో ట్వీట్ చేశారు.  

"ఓ బీజేపీ కార్యకర్తగా ఈ ప్రసంగాన్ని విన్నాను. నాకెంతో స్ఫూర్తినిచ్చింది. మా పార్టీ సిద్ధాంతాలు, విలువులను ఈ ప్రసంగం ప్రతిబింబించింది. మిగతా పార్టీ కార్యకర్తలకూ ఇది స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నాను" 

-ప్రధాని నరేంద్ర మోదీ

Published at : 24 Feb 2023 03:12 PM (IST) Tags: BS Yediyurappa Karnataka BS Yediyurappa Retirement Former CM of Karnataka

సంబంధిత కథనాలు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్