అన్వేషించండి

Maharashtra Crisis: డిప్యుటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండేకు ఛాన్స్ రానుందా, మహా రాజకీయాల్లో తరవాతి మలుపేంటి?

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏక్‌నాథ్ షిండేకు డిప్యుటీ సీఎం పదవి ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్..?

మహారాష్ట్రలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరిగాయో, చివరకు అవి ఎక్కడికి దారి తీశాయో చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ఫ్లోర్‌ టెస్ట్ చేయకముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఉద్దవ్ థాక్రే. ఈ పరిణామం తరవాత అటు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవటం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వెనక భాజపా ఉందని మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేసేలాగే ఉంది భాజపా నేతల తీరు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన ఈ తరుణంలో...రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది భాజపా. దేవేంద్ర ఫడణవీస్‌ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. 

మహా రాజకీయాల్లో కీలకంగా ఆ ఇల్లు..

భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్, రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే కలిసి తదుపరి ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ముంబయిలోని మలబార్‌ హిల్స్‌లో ఉన్న ఫడణవీస్ ఇంట్లోనే పార్టీ నేతలంతా కలిసి తరవాతి వ్యూహాలు అమలుపై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫడణవీస్‌ ఇల్లు "షిండే క్యాంప్‌కి బ్యాక్ ఎండ్ ఆఫీస్‌"లాంటిది అని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 
ఇప్పుడు ఇదే ఇల్లు మహా రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించనుంది. ఈ పది రోజుల్లోనే పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు రెండు సార్లు ఫడణవీస్ ఇక్కడికి వచ్చారట. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేయటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
శివసేన నుంచి మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునేలా షిండేకు ప్లాన్ ఇచ్చింది భాజపాయే అన్నదీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. 

ఏక్‌నాథ్ షిండేకి డిప్యుటీ సీఎం పదవి..? 

ఇదంతా చేసినందుకు షిండేకు భాజపా మంచి గిఫ్టే ఆఫర్ చేయనుందని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మొదలు కాగానే ఏక్‌నాథ్ షిండేను ఉపముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలున్నాయి. షిండేకి మాత్రమే కాదు. థాక్రేలకు వ్యతిరేకంగా పోరాడటంలో తనకు సహకరించేందుకు మంత్రి పదవులు వదులుకున్న వారికీ..ప్రాధాన్యత దక్కనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్-BMCపై ఆధిపత్యం సాధించేందుకూ భాజపా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్ ఇది. ఓ రాష్ట్రానికి పెట్టేంత బడ్జెట్‌ ఈ కార్పొరేషన్ డెవలప్‌మెంట్‌ కోసం కేటాయిస్తారు. ఇంత కీలకమైన కార్పొరేషన్‌నూ దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నందునఈ లోపు రాష్ట్రంపై పూర్తి స్థాయి పట్టు సాధించాలని భావిస్తోంది. ఇదన్నమాట విషయం. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
Warangal Latest News: మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP DesamBan vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
Warangal Latest News: మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
NTR Neel Movie :'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
Free Health Insurance Scheme In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
Tirupati News: తిరుపతి మేయర్‌పై కార్పొరేటర్ల అసంతృప్తి- వచ్చే నెలలో   అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్
తిరుపతి మేయర్‌పై కార్పొరేటర్ల అసంతృప్తి- వచ్చే నెలలో అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్
Embed widget