అన్వేషించండి

రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదు, ప్రజలు మావైపే ఉన్నారు - రాహుల్ గాంధీ

Rahul Gandhi: రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

Bharat Jodo Nyay Yatra Ends: భారత్‌ జోడో న్యాయ్ యాత్రని (Bharat Jodo Nyay Yatra) ముంబయిలో ముగించారు రాహుల్ గాంధీ. మణిపూర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర 63 రోజుల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ముంబయిలో భారీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. ఈ ర్యాలీలోనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేయాలంటూ ఇటీవల కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. బీజేపీ పదేపదే రాజ్యాంగంలో మార్పుల గురించి మాట్లాడడం తప్ప అందులో మార్పులు చేసే ధైర్యం ఆ పార్టీకి లేదని అన్నారు. రాజ్యాంగంలోని నిజాల్ని మార్చే ధైర్యం ఆ పార్టీకు ఎప్పటికీ రాదని తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా రాయించుకుందని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ ఇచ్చారు రాహుల్. అయితే...ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని, పార్టీతో సంబంధం లేదని బీజేపీ చెప్పినప్పటికీ వివాదాస్పదమయ్యాయి. ముంబయిలోని మహాత్మా గాంధీ ఇంటి వద్ద న్యాయ్ సంకల్ప్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో రాహుల్ ఈ విమర్శలు చేశారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో 1942లో మహాత్మా గాంధీ ఇక్కడి నుంచే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 

"రాజ్యాంగం గురించి బీజేపీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంది. కానీ అందులో మార్పులు చేసే ధైర్యం మాత్రం ఆ పార్టీకి లేదు. ప్రజలు మా వైపే ఉన్నారు. నిజం కూడా మా వైపే ఉంది. కేవలం ఒకే వ్యక్తి కేంద్రంగా దేశాన్ని నడిపించాలని చూస్తున్నారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాల్ని గౌరవించాలి. వాళ్ల కష్టాలేంటో వినాలి"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

దేశవ్యాప్తంగా విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అంటూ మండి పడ్డారు రాహుల్ గాంధీ. పేదలు, రైతులు, వెకనబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. ఇన్ని కోట్ల మందిలో సరిగ్గా న్యాయం జరిగేది 5% మంది ప్రజలకే అని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు సహా మిగతా సంస్థలన్నీ కేవలం తమ కోసమే పని చేయాలని బీజేపీ భావిస్తోందని ఫైర్ అయ్యారు. 

"ఈ దేశంలో 5% మందికే సరైన న్యాయం జరుగుతోంది మిగతా వాళ్లంతా న్యాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ దేశంలోని కోర్టులు సహా ఇతరా సంస్థలన్నీ తమ కోసమే పని చేయాలని చూస్తోంది. దాదాపు 90% మంది ప్రజలు అన్యాయమైపోతున్నారు. అనవసరంగా విద్వేషాలు ప్రచారం చేస్తున్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత..ఇలా ఎవరిని చూసినా న్యాయం సరైన న్యాయం జరగడం లేదు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget