అన్వేషించండి

Khushbu Old Tweet: ఖుష్బూని టార్గెట్ చేసిన కాంగ్రెస్, పాత ట్వీట్‌ను వైరల్ చేస్తూ విమర్శలు

Khushbu Old Tweet: ఖుష్బూ పాత ట్వీట్‌ను వైరల్ చేస్తూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.

Khushbu Old Tweet:

2018లో ట్వీట్..

బీజేపీ నేత ఖుష్బూ సుందర్ చిక్కుల్లో పడ్డారు. 2018లో ఆమె చేసిన ట్వీట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. "అప్పుడలా..ఇప్పుడేమో ఇలా" అంటూ రెండు ట్వీట్‌లను పోల్చుతూ మండి పడుతోంది. ఇంతకీ జరిగిందేంటంటే...2018లో కాంగ్రెస్‌లో ఉన్నారు ఖుష్బూ. అప్పట్లో మోదీకి వ్యతిరేకంగా ఓ ట్వీట్ చేశారు. లలిత్ మోదీ, నీరవ్‌ మోదీ, నరేంద్ర మోదీలను పోల్చుతూ ఆమె అప్పట్లో ఓ పోస్ట్ చేశారు. 

"చూడండి. మోదీ ఎక్కడున్నారో అక్కడే మోదీలు ఉన్నారు. కానీ అదేంటో మోదీ అనే ఇంటి పేరు కేవలం దొంగలకే ఉంది. మోదీ అనే పేరుని అవినీతి అని మార్చేయడం మంచిదేమో. నీరవ్, లలిత్, నరేంద్ర మోదీలకు ఇదే కరెక్ట్. నరేంద్ర మోదీ అంటేనే అవినీతి"

- ఖుష్బూ సుందర్, 2018లో చేసిన ట్వీట్ 

ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ట్విటర్ బయోలే "మోదీ ఫర్ ఇండియా" అని రాసుకున్నారు. ఇప్పుడు ఈ బయోనే టార్గెట్ చేసుకుంది కాంగ్రెస్. అప్పుడేమో మోదీ అంటే అవినీతి అని ట్వీట్‌లు చేసి..ఇప్పుడేమో మోదీ ఫర్ ఇండియా అని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వరుసగా అందరూ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై ఖుష్బూ సుందర్ స్పందించక తప్పలేదు. తన పాత ట్వీట్‌లను తవ్వి తీస్తుండటాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ఎంత అసహనంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. 

"నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మోదీపై చేసిన ఆ ట్వీట్ విషయంలో నేనేమీ సిగ్గు పడడం లేదు. అప్పటికి మా లీడర్ ఆదేశాల మేరకు నడుచుకున్నాను. ఆ పార్టీ గొంతుకనే వినిపించానంతే"

- ఖుష్బూ సుందర్, బీజేపీ నేత 

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైన ఖుష్బూ..2020లో బీజేపీలో చేరారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన తరవాత బీజేపీపై అటాక్ మొదలు పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే...ఖుష్బూని టార్గెట్ చేసింది. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. రెండ్రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. అధిష్ఠానం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. దేశవ్యాప్తంగా "సంకల్ప్ సత్యాగ్రహ" నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని చోట్లా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సత్యాగ్ర దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కానీ నిరసన మొదలు పెట్టిన కాసేపటికే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని దీక్షను విరమించాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఆందోళనలు జరగకుండా రాజ్‌ఘాట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. 

Also Read: Rahul Gandhi Twitter Bio: రాహుల్ గాంధీ ట్విటర్ బయో గమనించారా? ఇది కూడా బీజేపీపై సెటైరేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులుకర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Embed widget