అన్వేషించండి

Bankipur By Election: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ - బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా నామినేషన్ ఉపసంహరణ !

Prashant Kishor: బీహార్ రాజకీయాల్లో ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా చేశారు.

Bankipur Assembly BJP Candidate: బీహార్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బంకీపూర్ అసెంబ్లీ స్థాన ఉపఎన్నిక వేళ ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. బీజేపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ సిన్హా  , కేవలం 24 గంటల వ్యవధిలోనే శుక్రవారం  తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు. కుటుంబ కారణాల వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరఫ్గీకి లేఖ రాశారు. అయితే, బీజేపీ కోటగా భావించే బంకీపూర్‌లో నామినేషన్ వేసిన అభ్యర్థి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం వెనుక అసలు కారణం  జన్ సూరాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  సృష్టించిన పొలిటికల్ మైండ్ గేమేనని బీహార్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

ఈ ఉపఎన్నిక ద్వారా ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పీకే లాంటి బలమైన అభ్యర్థి ముందు అభిషేక్ సిన్హా చాలా బలహీనమైన క్యాండిడేట్ అని, ఆయన నిలబడితే బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిందట. దీనికి తోడు, అభిషేక్ సిన్హాకు సంబంధించిన కొన్ని వివాదాస్పద ఆర్థిక లావాదేవీల  చిట్టా ప్రశాంత్ కిషోర్ వద్దకు చేరిందనే ప్రచారం   జోరందుకుంది. ఒకవేళ పీకే వాటిని ఎన్నికల ప్రచారంలో బయటపెడితే పార్టీ పరువు పోతుందని భావించిన అధిష్టానమే, అభిషేక్‌తో బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసిందనే చర్చ నడుస్తోంది.

బీజేపీ అభ్యర్థి వెనక్కి తగ్గడాన్ని ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో క్యాష్ చేసుకున్నారు.  బీజేపీ భయంతో ప్రజలు వెనక్కి తగ్గడం చూశాం కానీ, ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థే రంగం వదిలి పారిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి  అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంకీపూర్ తమ అజేయమైన కోట అని, అక్కడ కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అహంకారంతో మాట్లాడే బీజేపీకి ఇప్పుడు అభ్యర్థే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పీకే దూకుడుకు బ్రేక్ వేసేందుకు బీజేపీ వెంటనే అలర్ట్ అయి, క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన 32 ఏళ్ల యువజన విభాగం నేత నీరజ్ కుమార్ సిన్హాను కొత్త అభ్యర్థిగా బరిలోకి దించుతూ కేంద్ర ఎన్నికల కమిటీ ద్వారా ప్రకటన చేయించింది.

ఈ స్థానం ఖాళీ అవ్వడానికి కారణం.. ఇక్కడి నుంచి ఐదుసార్లు వరుసగా గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడమే. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నవీన్ ఇక్కడి నుంచి ఆర్‌జేడీ  అభ్యర్థి రేఖా కుమారిపై 51,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో జన చైతన్య యాత్రలో ఉన్న పీకే పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, ఇప్పుడు స్వయంగా ప్రశాంత్ కిషోర్ బరిలో ఉండటం, ఆర్జేడీ తరఫున మళ్లీ రేఖా కుమారి పోటీలో నిలవడంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న కౌంటింగ్ జరగనున్న ఈ ఎన్నికను పీకే తన రాజకీయ భవిష్యత్తుకు ఒక  రెఫరెండం గా అభివర్ణిస్తున్నారు.

అంతిమంగా చూస్తే.. అభిషేక్ సిన్హా విరమణతో బీజేపీ డిఫెన్స్‌లో పడిందనే నెరేటివ్‌ను సెట్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ సఫలమయ్యారు. ఒకప్పుడు తెరవెనుక ఉండి దేశవ్యాప్తంగా ఎందరినో సీఎంలను, పీఎంలను చేసిన పీకే.. ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యేగా గెలిచే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. ఈ క్రమంలోనే పాతబస్తీ తరహా ఓట్ల సమీకరణాలు, కేడర్ భరోసా లెక్కలను తిరగరాస్తూ బీజేపీపై ఆయన పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మూడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్ మూలాలున్న బంకీపూర్ ఓటర్లు పీకే ప్రయోగాలను ఆదరిస్తారా.. లేక కొత్తగా వచ్చిన సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నీరజ్ సిన్హాకు పట్టం కడతారా అనేది బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bankipur By Election: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ - బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా నామినేషన్ ఉపసంహరణ !
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ - బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా నామినేషన్ ఉపసంహరణ !
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
జగన్నాథ రథయాత్ర వివాదం: ఇస్కాన్‌కు కళింగ సేన అల్టిమేటం!
జగన్నాథ రథయాత్ర వివాదం: ఇస్కాన్‌కు కళింగ సేన అల్టిమేటం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget