అన్వేషించండి

Bengaluru Water Crisis: కలుషిత నీళ్లు తాగుతున్న బెంగళూరు వాసులు, పెరుగుతున్న కలరా కేసులు

Bengaluru Water Crisis: బెంగళూరులో కలరా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Water Crisis in Bengaluru: బెంగళూరు వాసులకు నీటి కష్టాలు (Bengaluru Water Crisis) ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఒక్కొక్క నీటి బొట్టుని చాలా పొదుపుగా వాడుకుంటే తప్ప అవసరాలు తీరడం లేదు. అటు ప్రభుత్వం కూడా నీటిని వృథా చేయకుండా కఠిన ఆంక్షలు పెడుతోంది. ఈ సంక్షోభంలో చాలా మంది ఏ నీళ్లు పడితే వాటిని తాగేస్తున్నారు. పలు చోట్ల నీళ్లు కలుషితంగా ఉంటున్నాయి. ఇవే కలరా వ్యాధికి దారి తీస్తోంది. ఈ మధ్య కాలంలోనే కలరా కేసులు 40% మేర పెరిగినట్టు ప్రభుత్వ,  ప్రైవేట్ హాస్పిటల్స్‌లోని రికార్డులే చెబుతున్నాయి. గతంలో నెలకు ఒకటి లేదా రెండు కలరా కేసులు నమోదయ్యేవి. కానీ మార్చి నెలలో గత రెండు వారాల్లోనే సగటున 7 కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో చాలా మంది బయటి ఫుడ్ తిన్న వాళ్లే.

అయితే...బెంగళూరులో చాలా చోట్ల బయట ఫుడ్ స్టాల్స్‌లో నీళ్లు కలుషితంగా ఉంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. నీటి కొరత కారణంగా ఏవి పడితే అవి తీసుకొచ్చి వాటితోనే ఆహారం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పానీపూరి తిన్న వాళ్లే కలరా బారిన పడుతున్నారు. ఇక ఎండాకాలం కావడం వల్ల చాలా మంది బయట జ్యూస్‌లు తాగుతున్నారు. ఈ జ్యూస్‌లలోనూ కలుషిత నీరు కలుస్తోంది. ఫలితంగా..అవి తాగిన వాళ్లకీ కలరా సోకుతోంది. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, నీరసం లాంటి లక్షణాలతో కొందరు హాస్పిటల్స్‌లో చేరుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొంత మందికి ఇది డయేరియాకీ దారి తీస్తోంది. శరీరంలోని నీరంతా బయటకి వెళ్లిపోవడం వల్ల డీహైడ్రేట్ అవుతున్నారు. 

కొన్ని సార్లు కలరా కిడ్నీలపై ప్రభావం చూపించే ప్రమాదముందని (Cholera Cases in Bengaluru) డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రమైన నీటినే తాగాలని సూచిస్తున్నారు. అటు ప్రభుత్వం వీలైనంత వరకూ నీటిని పొదుపు చేసే మార్గాలను వెతుకుతోంది. ఆ మేరకు బెంగళూరు వాసులకు సలహాలు, సూచనలు చేస్తోంది. ఐటీ ఉద్యోగులు కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేస్తున్నారు. ఆఫీస్‌లలో నీటి వినియోగాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు కొన్ని ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఎండాకాలం చెమటలు పడుతుంటాయి. ఆ వేడిని తట్టుకునేందుకు చాలా మంది పదేపదే ముఖం కడుక్కుంటారు. కానీ ఈసారి మాత్రం వెట్‌వైప్స్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. నీటి వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇళ్లలో వంట చేసుకునేందుకు తక్కువ పాత్రల్ని వాడుతున్నారు. డిస్పోజబుల్ ప్లేట్‌లు, గ్లాస్‌లనే వినియోగిస్తున్నారు. మిల్క్ ట్యాంకర్‌లలో నీళ్లు సరఫరా చేస్తూ కొంత వరకూ నీటి కొరతను తీర్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. Bangalore Water Supply and Sewerage Board (BWSSB) చేపడుతున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఇటీవలే బెంగళూరు అధికారులతో కేంద్ర ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం బెంగళూరు నీటి కొరతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. మురుగు నీటిని రీసైక్లింగ్ చేసి వాడుకోవాలన్న ఆలోచననూ మెచ్చుకున్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి అధికారులు మరికొన్ని కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకురానున్నారు. పరిమితికి మించి నీళ్లు వినియోగించిన వాళ్లకు సరఫరాపై ఆంక్షలు విధించే యోచనలో ఉన్నారు. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget