అన్వేషించండి

West Bengal: మమతా బెనర్జీపై పరువు నష్టం దావా కేసు వేసిన గవర్నర్, ముదురుతున్న పంచాయితీ

Mamata Banerjee: బెంగాల్‌లో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. రాజ్‌భవన్‌కి మహిళలు వెళ్లాలంటనే భయపడుతున్నారంటూ దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

CV Ananda Bose: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు తారస్థాయి చేరుకున్నాయి. ఈ మధ్య మమతా గవర్నర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌కి వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారని, ఆ స్థాయిలో వాళ్లను వేధిస్తున్నారని ఆరోపించారు. కొంత మంది బాధితులు తమతో ఈ గోడు చెప్పుకున్నారని మమతా అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆనంద బోస్‌ మండి పడ్డారు. మమతా బెనర్జీపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ప్రజా ప్రతినిధి అయ్యుండి ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అనవసరపు అలజడి సృష్టించొద్దని తేల్చి చెప్పారు. మమతా బెనర్జీతో పాటు మరి కొంత మంది తృణమూల్ నేతలపైనా పరువునష్టం దావా వేశారు ఆనంద బోస్.

మే 2వ తేదీన ఈ వివాదం మొదలైంది. రాజ్‌భవన్‌లోని ఓ మహిళా ఉద్యోగి గవర్నర్‌ ఆనంద బోస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధించారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. ఇదే విషయమై కొంత మంది తృణమూల్ నేతల్ని మీడియా పదేపదే ప్రశ్నించింది. కానీ హైకమాండ్ ఆదేశాలు ఇవ్వకుండా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేమని ఆయా నేతలు తేల్చి చెప్పారు. అటు బీజేపీ నేతలు మాత్రం గవర్నర్‌కి అండగా ఉన్నారు. మమతా బెనర్జీపై పరువునష్టం దావా వేయడాన్ని సమర్థించారు. ఎప్పుడో ఈ పని చేయాల్సింది అని వెల్లడించారు. 

ఇటీవలే ఎన్నికైన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. రాజ్‌భవన్‌కి వెళ్లాలంటే తమకు భయంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా రాజకీయంగా దుమారం రేగింది. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన చేసింది. కేవలం తమ వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారని, అంతకు మించి ఏ కారణమూ లేదని వెల్లడించింది. ప్రజాప్రతినిధులు అయ్యుండి అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మందలించింది. అలాంటి చెత్త వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం కూడా లేదని చాలా ఘాటుగా సమాధానమిచ్చింది.

అటు దీదీ మాత్రం గవర్నర్‌పై మండి పడుతూనే ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే...రాజ్‌భవన్ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని ఎదురు చూసినట్టు స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకూ వాళ్ల నుంచి రాజ్‌భవన్‌కి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. గవర్నర్‌ ఢిల్లీలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి వచ్చిందని, అందుకే అప్పుడు ఆయన అందుబాటులో లేరని వివరించింది. మొత్తంగా ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికైతే గవర్నర్‌పై విచారణ కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమా కాదా పోలీసులే తేల్చనున్నారు. 

Also Read: అలా చేస్తే మగవాళ్లు ఇట్టే మందు మానేస్తారు, మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget