అన్వేషించండి

PM Modi: మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని ఫోన్‌కాల్, హిందువులకు భద్రత కల్పిస్తామని భరోసా

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ మోదీకి కాల్ చేసి మాట్లాడారు. హిందువులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాలో అనిశ్చితిని దారికి తెచ్చేందుకు సహకరిస్తామని మోదీ వెల్లడించారు.

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను నిరసిస్తూ ఇటీవలే లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల పంద్రాగష్టు ప్రసంగంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం ప్రస్తావించారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రతకు భరోసా ఇస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. హిందువులకు ఏమీ కాకుండా చూసుకుంటాని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీయే వెల్లడించారు. X వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్ ప్రధాని కాల్ చేసిన మాట్లాడినట్టు వివరించారు. అక్కడి పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో చర్చించినట్టు వెల్లడించారు. హిందువులతో పాటు అక్కడి మైనార్టీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. 

"బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ నాకు కాల్ చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై చర్చించాం. బంగ్లాదేశ్ సుస్థిరతకు భారత్ అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పాను. అక్కడ హిందువులతో పాటు మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇప్పటికే మహమ్మద్ యూనస్ ధాకాలో ధాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి హిందువులతో మాట్లాడారు. మైనార్టీలపై దాడులు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా అక్కడి హిందూ ఇళ్లలోకి చొరబడి ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఆలయాలనూ నేలమట్టం చేశారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ కూడా ధ్వంసమైంది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. అయితే..జమాతే ఇస్లామీ పార్టీ కార్యకర్తలే ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పార్టీ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యూనస్ హిందువులపై దాడులను ఖండించారు. వాళ్లు కూడా మన దేశ పౌరులేనని, వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని బంగ్లా పౌరులకు పిలుపునిచ్చారు.

విద్యార్థులెవరూ హిందువులపై దాడులు జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. కానీ...ఆ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవలే లక్షలాది మంది హిందువులు, మైనార్టీలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాడులను ఖండిస్తూ నినదించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తామూ ఈ దేశ  పౌరులమేనని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో మైనార్టీలకు  10% సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ని వినిపించారు. మైనార్టీలకు రక్షణ కల్పించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని నినదించారు. 

Also Read: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై మమతా బెనర్జీ నిరసన, హాస్పిటల్‌ వద్ద భారీ ర్యాలీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget