అన్వేషించండి

Bajrang Dal Ban: భజరంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ, వేడెక్కిన రాజకీయం

Bajrang Dal Ban: తాము అధికారంలోకి వచ్చాక భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై పొలిటికల్ హీట్ పెరిగింది.

Bajrang Dal Ban:

మేనిఫెస్టో తగలబెడుతూ నిరసనలు..

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఓ హామీ ఇప్పుడక్కడ పెద్ద దుమారమే రేపింది. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ని  బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు మండి పడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తగలబెడుతూ ఆందోళనలు చేపడుతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు కర్ణాటకలోని మంగళూరులోనూ ప్రొటెస్ట్ చేశారు. తక్షణమే ఆ హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది తామే అన్న కాన్ఫిడెంట్‌తో ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ మాత్రం డబుల్ ఇంజిన సర్కార్‌ కావాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించండి అని ప్రచారం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ రాజకీయాల్ని వేడెక్కించింది. భజరంగ్ దళ కార్యకర్తలకు కొందరు బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. వెంటనే ఆ హామీని వెనక్కి తీసుకోవాలని తేల్చి చెబుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భజరంగ్ దళ్, PFI లాంటి సంస్థల్ని బ్యాన్ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ సంస్థలు సమాజంలో విద్వేషాలు రెచ్చ గొడుతున్నాయని ఆరోపించింది. అందుకే వాటిపై నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. RSSకి అనుబంధ సంస్థ అయిన భజరంగ్ దళ్‌...కాంగ్రెస్ వైఖరిపై మండి పడుతోంది. తమ సంస్థ దేశానికే గర్వకారణమని అంటోంది. 

"దేశభక్తిని అందరిలోనూ రగిలించే గొప్ప సంస్థ భజరంగ్ దళ్. ఈ సంస్థ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. పవిత్రమైన గోవులను సంరక్షిస్తోంది. దేశంలోని లక్షలాది మందికి రక్తదానం చేస్తోంది. మా సంస్థ దేశానికే గర్వకారణం. కానీ కాంగ్రెస్ మాత్రం మా సంస్థను PFIతో పోల్చుతోంది. ఇలా పోల్చడం ఆత్మహత్యలాంటిదే. కాంగ్రెస్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతోంది. భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ యాంటీ హిందూ అని మరోసారి రుజువు చేసుకుంది. అధిష్ఠానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. వెంటనే ఈ హామీని వెనక్కి తీసుకోవాలి"

- వీహెచ్‌పీ ప్రతినిధి 

బీజేపీ ఉచిత హామీలు..

ఇక బీజేపీ విషయానికొస్తే...మేనిఫెస్టోలో మొత్తం  16 ప్రధాన హామీలు..103 ముఖ్యమైన హామీలు ఉన్నాయి.  ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఘనంగా ప్రకటించింది. ఉగాధి, వినాయకచవితి, దీపావళి పండగ కానుకగా ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో తెలిపింది. ఇక ఎన్నికల ప్రకటన విడుదలకు ముందు కన్నడ సీమలో రచ్చరచ్చగా మారిన పాలు, పెరుగు వివాదంలో ఓటర్లను శాంతించే రీతిలో పోషణ పథకం కింద ఉచితంగా పాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.  పెరుగును దహీ అనాలని.. నందిని మిల్క్‌ డెయిరీకి ప్రత్యామ్నాయంగా అమూల్‌ పాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పోషణ పథకం కింద ఉచితంగా నందిని పాలు పంపిణీ చేస్తామని కన్నడిగుల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాషాయ నేతలు. 

Also Read: Wrestlers Protest: మోదీజీ మా మన్‌ కీ బాత్ వినండి, మంత్రిని కలిసి ఏడ్చినా న్యాయం జరగలేదు - రెజ్లర్ వినేష్ ఫోగట్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget