అన్వేషించండి

Ram Mandir: ఆలయ నిర్మాణంలో అడుగడుగునా సవాళ్లు, అయినా అద్భుతం సృష్టించిన ఇంజనీర్లు

Ram Mandir Inauguration: అయోధ్య ఆలయాన్ని నిర్మించే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Ram Mandir Opening: దాదాపు 500 ఏళ్ల కల నెరవేరింది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకీ అంతా సిద్ధమైంది. 2019లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తరవాత మొదలైన మందిర నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మిగతా నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. నగర శైలిలో దీన్ని నిర్మించారు. అయితే...ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవలే నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయని, వాటన్నింటినీ దాటుకుని విజయవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేశామని వివరించారు. ఈ సమస్యల్లో మొదటికి కూలీల కొరత. గతేడాది నవంబర్‌లో తన పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం చెప్పారు నృపేంద్ర మిశ్రా. దీపావళి సమయంలో చాలా మంది కూలీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు కూలీలు దొరకడమే కష్టమైపోయింది. నిర్మాణ పనులు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందినట్టు చెప్పారు మిశ్రా. డిసెంబర్ 31 నాటికి అంతా పూర్తి చేయాలని అప్పటికే టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం 3,500 మంది కూలీలు అప్పటికి అందుబాటులో ఉన్నారు. L&T సంస్థ నిర్మాణ పనులు చేపట్టగా...TATA సంస్థ వీటిని పర్యవేక్షించింది. కూలీలను రిక్రూట్ చేసుకునే బాధ్యతని L&T సంస్థే తీసుకుంది. అక్కడ ఒక్కో పనికి ఒక్కో నైపుణ్యం ఉన్న కూలీలు కావాల్సి ఉంటుంది. రాళ్లను ఎత్తడానికి రాజస్థాన్‌ నుంచి, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చడానికి ఒడిశా నుంచి కూలీలను రప్పించారు. మొత్తంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ నుంచే ఎక్కువగా పని చేశారు. 

మట్టితోనే అసలు సమస్య..

ఆలయ నిర్మాణం జరిగిన ప్రాంతంలో మట్టి స్థిరంగా లేదు. వందల ఏళ్ల క్రితం ఇక్కడ సరయూ నది ప్రవహించడం వల్ల ఇంకా అక్కడి మట్టిలో ఆ వదులుదనం ఉన్నట్టు వివరించారు మిశ్రా. నిర్మాణం చేపట్టే క్రమంలో ఇంజనీర్లు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇదే. ఆ సమయంలోనే IIT చెన్నై సహకారం తీసుకున్నారు. 15 మీటర్ల లోతు వరకూ మట్టిని తవ్వి దాన్ని తొలగించి అక్కడ re-engineered soilతో నింపాలని సూచించారు. ఇదే 14 రోజుల తరవాత గట్టి పడుతుందని చెప్పారు ఎక్స్‌పర్ట్‌లు. వాళ్లు చెప్పినట్టుగానే అది రాయిలా తయారైంది. దానిపైనే నిర్మాణం మొదలు పెట్టారు. ఆ తరవాత అసలైన సవాలు...ఆలయం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం. ముఖ్యంగా భూకంపాలను తట్టుకుని నిలబడిగేలా తీర్చి దిద్దడం. అందుకోసం...Central Building Research Institute (CBRI) సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ నమోదైన భూకంపాలకు 50 రెట్లు ఎక్కువగా ప్రకంపనలు వచ్చినా కొంచెం కూడా కదలకుండా పటిష్ఠంగా నిర్మించేలా సూచనలు చేశారు. ల్యాబ్‌లో సిమ్యులేషన్ చేసిన తరవాత పునాదిని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. అందుకే..వెయ్యేళ్లైనా సరే చెక్కు చెదరదని అంత ధీమాగా చెబుతున్నారు. ఈ సవాళ్లన్నీ దాటుకుని ఇలా తుది రూపునకు వచ్చింది అయోధ్య రామ మందిరం. 

Also Read: Ram Mandir Inauguration: బాల రాముడి ఫొటోలు బయటకి రావడంపై ట్రస్ట్ అసహనం, విచారణకు డిమాండ్

 

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Embed widget