By: Ram Manohar | Updated at : 23 Oct 2022 11:03 AM (IST)
అయోధ్యలో జరిగే దీపోత్సవానికి ప్రధాని హాజరు కానున్నారు. (Image Credits: PIB)
Ayodhya Deepotsav 2022:
15 లక్షల దీపాలు..
ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలకు హాజరు కానున్నారు. సాయంత్రం జరగనున్న దీపోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం...మోదీ ముందుగా సాయంత్రం 5 గంటలకు భగవాన్ రామ్లల్లా విరాజ్మాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరవాత రామ్ జన్మభూమి తీర్థక్షేత్రను సందర్శిస్తారు. 5.45 నిముషాలకు భగవాన్ రామ్కు రాజ్యాభిషేకం చేస్తారు. 6.30 నిముషాలకు సరయూ నదిలో హారతి ఘాట్కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే దీపోత్సవంలో పాల్గొంటారు. ఆరేళ్లుగా ఇక్కడ దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తొలిసారి నేరుగా ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా...15 లక్షలకు పైగా దీపాలు వెలిగిస్తారని అంచనా. రాముడి యానిమేటెడ్ ఇమేజ్లనూ ప్రదర్శించనున్నారు. వీటితో పాటు రకరకాల రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శనలు చేస్తారు. తరవాత గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షో ఏర్పాటు చేస్తారు. సరయూ నదీ తీరాన...3-D Holographic Projection Mapping Showకి ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని రాకతో...అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Uttar Pradesh | Security heightened in Ayodhya ahead of PM Modi's arrival to take part in Deepotsav celebrations
PM will offer prayers to Lord Ramlala Virajman, followed by an inspection of the Shree Ram Janmabhoomi Teerth Kshetra site. pic.twitter.com/VfIxbHOcj7 — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 23, 2022
దారి మళ్లింపు..
ప్రధాని మోదీ రాకతో...కొన్ని చోట్ల దారులు మళ్లించనున్నారు. రాత్రి 8 గంటల వరకూ కొన్ని ఆంక్షలు విధిస్తారు. భారీ వాహనాలు, డీసీఎమ్లు, ట్రాక్టర్లు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోనున్నారు. లక్నో నుంచి గోరఖ్పూర్ లేదా బస్తీ వెళ్లే వాళ్లు...వయా బరబంకి నుంచి జర్వాల్ రోడ్ వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.
SSC CHSLE 2022 Key: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?