అన్వేషించండి

Election 2022 Date Announcement LIVE: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను శనివారం ప్రకటిస్తుంది.

LIVE

Key Events
Election 2022 Date Announcement LIVE:  5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Background

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలనే వివిధ పార్టీలు కోరుతున్నాయి. అయితే భారత ఎన్నికల సంఘం శనివారం 5 రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం ఈసీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. 

ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.  మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.  

7 దశల్లో ఎన్నికల నిర్వహణ 

మెుదటి దశ పోలింగ్ తేదీ : ఫిబ్రవరి 10
రెండో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 14(పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్)
మూడో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20
నాలుగో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 23
ఐదో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27(మణిపూర్)
ఆరోదశ పోలింగ్ తేదీ : మార్చి 3(మణిపూర్)
ఏడో దశ పోలింగ్ తేదీ : మార్చి 7 

కోవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గించామని సీఈసీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవపరిమితి రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. 

అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలకు అనుమతి 

కోవిడ్ కారణంగా జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించామని సీఈసీ తెలిపారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదని పేర్కొన్నారు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేసినట్లు తెలిపారు. పాదయాత్రలు, రోడ్ షోలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. డబుల్ వ్యాక్సిన్లు తీసుకున్నవారినే ఎన్నికల డ్యూటీ వేస్తామన్నామని సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. 

16:20 PM (IST)  •  08 Jan 2022

ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు

ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.  మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.  

16:10 PM (IST)  •  08 Jan 2022

7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 ఫేజ్ లలో నిర్వహిస్తామని సీఈసీ తెలిపారు. 

16:07 PM (IST)  •  08 Jan 2022

జనవరి 15 వరకు రోడ్ షోలు రద్దు

కోవిడ్ కారణంగా జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించామని సీఈసీ తెలిపారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదని పేర్కొన్నారు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేసినట్లు తెలిపారు. పాదయాత్రలు, రోడ్ షోలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. డబుల్ వ్యాక్సిన్లు తీసుకున్నవారినే ఎన్నికల డ్యూటీ వేస్తామన్నారు. 

15:56 PM (IST)  •  08 Jan 2022

కోవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గింపు

కోవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గించామని సీఈసీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవపరిమితి రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. 

15:53 PM (IST)  •  08 Jan 2022

కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం : సీఈసీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొత్త నిబంధనలతో సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సీవిజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఈ యాప్ ద్వారా ఈసీ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం ఈసీ చర్యలు తీసకుంటుందన్నారు.  

15:45 PM (IST)  •  08 Jan 2022

ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 

15:44 PM (IST)  •  08 Jan 2022

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహణ : సీఈసీ సుశీల్ చంద్ర

కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 18 కోట్ల మందికి పైగా ఓటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసారి 18.34 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

15:41 PM (IST)  •  08 Jan 2022

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో చర్చించాం : సీఈసీ

'ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రంతో చర్చించాం. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం. మార్చిలో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ పదవీకాం ముగుస్తుంది. యూపీ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగుస్తుంది. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య, భద్రతా నిపుణులతో చర్చించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాం. ' సీఈసీ 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABPTDP Ex MLA Prabhakar Chowdary | అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవటంపై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Embed widget