అన్వేషించండి

Bypoll Results 2024: బీజేపీని టెన్షన్ పెడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు, మెజార్టీ స్థానాల్లో ఇండీ కూటమి లీడ్‌

Assembly Bypolls 2024: 7 రాష్ట్రాల్లోని 13 నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో ఇండీ కూటమి లీడ్‌లో దూసుకుపోతోంది.

Assembly Bypolls Results 2024: బీజేపీ, ఇండీ కూటమికి మరోసారి హోరాహోరీ (Bypoll Results 2024) కనిపిస్తోంది. 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ (జులై 13) విడుదలవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత వెలువడుతున్న ఫలితాలు కావడం వల్ల ఉత్కంఠ నెలకొంది. పైగా ఈ సారి బీజేపీకి తక్కువ సీట్‌లు వచ్చాయి. అటు ఇండీ కూటమి గట్టిగా పుంజుకుంది. కాంగ్రెస్‌ సొంతగా 99 సీట్లు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి పడింది. వెస్ట్‌బెంగాల్‌లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. ఈ అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్‌ని బట్టి చూస్తే మొత్తం 13 స్థానాల్లో 10 చోట్ల ఇండీ కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే బెంగాల్‌లో మొత్తం నాలుగు చోట్ల ఎన్నికలు జరగ్గా ఈ అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ లీడ్‌లో దూసుకుపోతోంది. 

అటు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఈ ఉప ఎన్నికల ఫలితం అక్కడి సీనియర్ నేతల ఫేట్‌ని మార్చేయనుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ భవితవ్యం కూడా ఈ రిజల్ట్‌పైనే ఆధారపడి ఉంది. హిమాచల్‌లోని దెహ్రా నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి కమలేశ్ ఠాకూర్ బరిలోకి దిగారు. అక్కడ ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా చూస్తే బీజేపీ అభ్యర్థి కన్నా ముందంజలో ఉన్నారు ఠాకూర్. మిగతా రెండు చోట్లా కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. అక్కడి మంగళూరు నియోజకవర్గంలో బీజేపీ వెనకబడింది. బీఎస్‌పీ కానీ కాంగ్రెస్ కానీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్‌లోని జలంధర్‌ నియోజకవర్గంలో గెలవడం ఆప్‌కి కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆప్‌ అధికారంలో ఉంది. జలంధర్‌లో గెలవడం అనేది ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి లిట్మస్ టెస్ట్‌గా మారింది. అందుకే ఆ పార్టీ ఈ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతానికైతే ఆప్‌ లీడ్‌లోనే ఉంది. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడం వల్ల ఉప ఎన్నికకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ RJDయే లీడింగ్‌లో ఉంది. తమిళనాడులో విక్రవంది నియోజకవర్గంలో డీఎమ్‌కేకి చెందిన అభ్యర్థి ముందంజలో ఉన్నారు.  

Also Read: Emergency Day: జూన్ 4వ తేదీని మోదీ ముక్తి దివస్‌గా ప్రకటించాలి, సంవిధాన్‌ హత్యా దివస్‌పై కాంగ్రెస్ సెటైర్లు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget