అన్వేషించండి

Assam-Mizoram Border Clash: అసోం-మిజోరం మధ్య అసలు సరిహద్దు వివాదం ఏంటి?

అసోం- మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. అసలు ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటిది?

ఈశాన్య భారతంలో మళ్లీ అలజడి చెలరేగింది. అసోం-మిజోరం రాష్ట్రాల సరిహద్దులో హింస పెల్లుబికింది. ఇరు రాష్ట్రాలు రాళ్లు రువ్వుకున్నాయి, పోలీసులు కాల్పులు జరపడంతో కొందరు తీవ్రంగా గాయపడగా ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. రైతుల గుడిసెలు తగలబడ్డాయి. ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంస మయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. బ్రిటీషు కాలం నుంచే ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. అసలు ఈ వివాదం ఏంటి? ఇప్పుడు ఎందుకు తిరగబెట్టింది..?

ఇప్పటిది కాదు..

అసోం- మిజోరం సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. బ్రిటీషు కాలం నుంచే ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య జూన్ నెల నుంచే తాజా వివాదం నడుస్తోంది. ఐత్లాంగ్హనార్ అనే ప్రాంతాన్ని అసోం తమ అధీనంలోకి తీసుకుంది. తమ భూభాగమైన ఆ ప్రాంతాన్ని మిజోరం ఆక్రమించుకుందంటూ అసోం ఆరోపించింది.

ఇక మిజోరంలోని మూడు జిల్లాలు అంటే ఐజ్వాల్, కొలాసిబ్, మమిత్‌లు అసోంలోని కాచర్, కరీంగంజ్, హైలకంది జిల్లాలతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్నాయి. జూన్ 30న కొలాసిబ్‌ జిల్లాకు సమీపంలోని సరిహద్దు దాటి అసోం తమ రాష్ట్ర భూభాగంలోకి అక్రమంగా చొరబడిందని మిజోరం ఆరోపణలు చేసింది. అయితే మిజోరం రాష్ట్రమే అసోంలోని హైలకంది జిల్లాలోకి 10 కిలోమీటర్ల మేర అక్రమంగా చొరబడి అక్కడ అరటి చెట్లు, వక్కపొడి చెట్లను నాటిందని అసోం రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. ఇక అసోం పోలీసులు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలోకి వచ్చి క్యాంపు వేశారని ఆ జిల్లా ఎస్పీ వాన్లాల్ ఫకా రాల్టే ఆరోపించారు.

ప్రత్యారోపణలు..

అసోం అధికారులు క్యాంపు వేసిన ప్రాంతం స్థానికంగా ఐత్లాంగ్హనార్ అని పిలుస్తారు. ఇది ఐత్లాంగ్ నది సమీపంలో ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం తమ రాష్ట్రానికి చెందుతుందని మిజోరం చెబుతోంది. ఈ గ్రామం అసోం సరిహద్దులో ఉంటుందని మిజోరం చెబుతోంది. అయితే అసోం వాదన ఇందుకు భిన్నంగా ఉంది. మిజోరం రాష్ట్రమే తమ భూభాగంలోకి అడుగుపెట్టి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోందని అసోం మండిపడింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆ తర్వాత అది కాస్త పెరగడంతో వివాదం మరింత వేడిని పెంచింది. దీంతో హింస చెలరేగింది.

ఆనాడు..

వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి బీజం బ్రిటీషు కాలంలోనే పడింది. అంతకుముందు అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య వివాదాలు చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుతం అసోం- మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు 165 కిలో మీటర్ల మేర ఉంది. ఒకప్పుడు మిజోరంను లుషాయ్ హిల్స్ అని పిలిచేవారు. అప్పుడు ఇది అసోం రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉండేది. అయితే 1857లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం లుషాయ్ హిల్స్‌.. కాచర్ ప్రాంతం నుంచి వేరుపడింది. ఆ తర్వాత 1933లో లుషాయ్ హిల్స్ మణిపూర్‌ల మధ్య ఓ సరిహద్దును తీసుకొస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇందుకు మిజోరం వాసులు అంగీకరించలేదు

ఇక భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈశాన్య భారతంలో క్రమంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. నాగాలాండ్(1963), అరుణాచల్ ప్రదేశ్ (1972) , మేఘాలయా (1972) మిజోరం (1972)రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అయితే మిజోరం- అసోం మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉమ్మడి సరిహద్దు వద్ద స్టేటస్‌కో మెయిన్‌టెయిన్ చేయాలని నిర్ణయించాయి. అయితే 2018 ఫిబ్రవరిలో మిజో జిర్లాయ్ పాల్ అనే విద్యార్థి సంఘం మిజోరం రైతుల కోసం అసోం భూభాగంలో ఒక రెస్ట్ హౌస్ నిర్మించారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోం పోలీసులు దాన్ని కూల్చివేశారు. అయితే గతేడాది అక్టోబర్‌లో ఒకే వారంలో రెండు సార్లు హింస చెలరేగింది. అసోంలోని లైలాపూర్ లో ఓ నిర్మాణం చేపట్టడంతో మిజోరం భగ్గుమంది. అది తమ భూభాగం అని వాదించింది.

ప్రస్తుతం పరిస్థితి మాత్రం కాస్త హింసాత్మకంగానే కనిపిస్తోంది. అసోం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందంటూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా.. అమిత్ షా, ప్రధాని కార్యాలయానికి ట్వీట్ చేశారు. కొందరు ఆందోళనకారులు కర్రలు పట్టుకుని మిజోరం భూభాగంలోకి రావడం, అసోం పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్‌లకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే మిజోరం స్థానికులే రాళ్లు రువ్వుతున్నారంటూ అసోం పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మిజోరం సీఎం జోరాంతంగాలు కేంద్రాన్ని కోరారు. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget