అన్వేషించండి

కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదే, జాతీయ హోదా కోల్పోవడం ఖాయం - హిమంత బిశ్వ శర్మ

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల తరవాత కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా కోల్పోతుందని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అసోం ముఖ్యమంత్రి (Himanta Biswa Sarma) హిమంత బిశ్వ శర్మ. త్వరలోనే ఆ పార్టీ జాతీయ హోదా కోల్పోతుందని జోస్యం చెప్పారు. అంతే కాదు. పలు రాష్ట్రాల్లో కేవలం ఓ స్థానిక పార్టీగా మిగిలిపోతుందని స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA 400 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇక చరిత్రలోనే చదువుకోవాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. ఆ పార్టీ పూర్తిగా పతనమైపోయిందని,జాతీయ నాయకత్వం అనేదే లేకుండా పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకూ క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని స్పష్టం చేశారు. 2015 వరకూ కాంగ్రెస్‌లోనే హిమంత బిశ్వ శర్మ ఆ తరవాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో మంచి గౌరవమే దక్కుతోంది. అంతకు ముందు కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ... ఆ పార్టీపై విమర్శలు చేసే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు హిమంత శర్మ. 

"కాంగ్రెస్ కథ ముగిసిపోయింది. ఇక ఆ పార్టీ గురించి చరిత్రలో చదువుకోవాల్సిందే. ఆ పార్టీ ముక్కలైపోతుంది. స్థానిక పార్టీల్లో ఓ పార్టీగా మిగిలిపోతుంది. ఈ లోక్‌సభ ఎన్నికల తరవాత కాంగ్రెస్‌కి ఉన్న జాతీయ పార్టీ హోదా కోల్పోతుంది. NDA 400కి పైగా స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతుంది. బీజేపీకి మించిన మంచి ఆప్షన్‌ ప్రజలకు కనిపించడం లేదు. త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలంతా విశ్వాసం కోల్పోతారు. ఇకపై ఆ పార్టీకి జాతీయ నాయకత్వం అనేదే కనిపించదు"

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

లోక్‌సభ ఎన్నికల్లో  Asom Gana Parishad (AGP)తో పాటు United People's Party Liberal (UPPL) తో కలిసి పోటీ చేయనున్నట్టు హిమంత ప్రకటించారు. మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో 11 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని, AGP రెండు చోట్ల, UPPL పార్టీ ఓ చోట బరిలోకి దిగుతుందని వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా గోస్వామి బీజేపీలో చేరడం సంచలనమైంది. మరో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే మద్దతునిచ్చారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు. 

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాల్య వివాహాలను జరగనివ్వనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పైనా విరుచుకు పడ్డారు. Assam Muslim Marriages and Divorces Registration Act, 1935 ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే AIUDFతో పాటు కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. దీనిపై చర్చ జరగాలని పట్టుపట్టినా అందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫలితంగా..ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Embed widget