అన్వేషించండి

AP Contractors : బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. టెండర్లకు స్పందన ఉండటం లేదు. పనులు ప్రారంభించిన చోట బెదిరింపుల కారణంగా ఆగిపోతున్నాయి.


ప్రభుత్వ రంగంలో ఏదైనా పనికి టెండర్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్లు వరుస కడతారు. పెద్ద పెద్ద సంస్థల నుంచి పనుల స్థాయిని బట్టి అధికార పార్టీ నేతల ద్వితీయ శ్రేణీ నేతలూ పోటీ  పడతారు. ఓ రకంగా అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరు ఇలాంటి కాంట్రాక్టులే. కానీ ఏపీలో అంతా రివర్స్ అయిపోయింది. కాంట్రాక్టులు ఇస్తామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. టెండర్లు వేయడం లేదు. అధికారులు సమావేశాలు పెట్టి సర్ది చెప్పినా నేరుగా బ్యాంకుల నుంచి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పినా ముందుకు రావడంలేదు. దీంతో ఏపీ టెండర్లలో అసలేం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది. 
రోడ్ల నుంచి భవనాల వరకూ దేనికీ స్పందించని ఏపీ కాంట్రాక్టర్లు..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. దీంతో అప్పులుతీసుకుని రోడ్లు బాగు చేయాలని పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అలాగే పెట్రోల్, డీజిల్‌పై రోడ్ల మరమ్మతుల కోసం లీటర్‌పై రూపాయి సెస్ వసూలు చేస్తున్నారు . దీంతో నిధుల కొరత లేదని అధికారులు  టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఒక్క రోడ్ల విషయంలోనే కాదు న్యూ డెలవప్‌మెంట్ బ్యాంక్ సాయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న రహదారుల పనులకూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రూ. 6400 కోట్లతో ఆ పనులను చేపట్టాలని టెండర్లు పిలిచారు. ఒక్కో పనికి ఒక్కో టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో   రద్దు చేశారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అంతే కాదు చివరికి అమరావతిలో హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి పిలిచిన టెండర్లకూ స్పందన లేదు.  రూ. 29 కోట్ల 40  లక్షల అంచనా వ్యంతో 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టడానికి టెండర్లు పిలిచారు. కానీ స్పందన లేదు.  గతంలో అమరావతిలో పనులు అంటే  ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడేవి. అలా దక్కించుకున్నవే శర వేగంగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేశాయి.  ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం ఆరు నెలల్లోనే పూర్తయింది. సెక్రటేరియట్ భవనాలూ అంతే వేగంగా పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు ఎవరూ టెండర్లు కూడా వేయడం లేదు.
AP Contractors : బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?

Also Read : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం
చేసిన పనులకు వేల కోట్లలోనే బకాయిలు..!  
సాధారణంగా కాంట్రాక్టర్లు ఓ పని చేసి బిల్లులు వసూలు చేసుకుంటారు. ఆ సొమ్ముతో మరో కాంట్రాక్ట్ పని చేస్తారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి వారికి గతంలో చేసిన పనుల తాలుకా బకాయిలే పెద్ద ఎత్తున విడుదల కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో చేసిన పనులకు తాము బిల్లులు ఇవ్వబోమని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.  రెండేళ్లుగా అటు ఉపాధి హామీ దగ్గర్నుంచి ఇటు రోడ్ల పనులు చేసిన వారికీ బిల్లులు చెల్లించడం లేదు. కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేస్తేనే వారుపనులు చేస్తామని నేరుగానే చెబుతున్నారు. మరికొంత మంది అయితే బిల్లుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు వెనుకాడకపోవడంతో నేరుగా బ్యాంకుల ద్వారా  చెల్లిస్తామని బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండగని కాంట్రాక్టర్లు, ఆ సంస్థలతో మాట్లాడాలని ప్రభుత్వ ఉన్నతాధికారులే ఇంజనీర్లను ఆదేశించారు. కానీ వారి మాటలపై కాంట్రాక్టర్లకు విశ్వాసం లేకుండా పోయింది. ఫలితంగా పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.
AP Contractors : బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?

Also Read : తెలుగు బిగ్‌బాస్‌కు సూపర్ రేటింగ్స్
అరకొర పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం బెదిరింపులు..! 
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో  చేస్తున్న పనులన్నింటినీ నిలిపివేసింది. అన్నింటికీ రివర్స్ టెండర్లకు వెళ్లింది. కాంట్రాక్టులు రద్దు చేయడంతో అప్పటి వరకూ చేసిన పనులకు చెల్లించాల్సినవి చెల్లించలేదు. కొత్తగా రివర్స్ టెండర్లేసిన వారు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇతర కారణాలతో పనులు ప్రారంభించలేదు. అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అభివృద్ధి పనులకోసం అతి స్వల్పంగా ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో రాజకీయ నేతల బెదిరింపులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోడ్ కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్న వీడియో ఇప్పటికే వైరల్ అయింది. ఆ పని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేతో పాటు బెదిరించిన నేత కూడా హాజరయ్యారు. కానీ ఇస్తామన్న కమిషన్ ఇవ్వకుండా పనులు ప్రారంభించినందుకు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు ఉన్నాయి.


ప్రభుత్వం విశ్వాసం పెంచుకుంటేనే అభివృద్ది పనులు.. !
ఓ వైపు బిల్లులు రాకపోవడం మరో వైపు అధికార పార్టీ నేతలు కమిషన్ల కోసం బెదిరింపులకు దిగడం వంటి పరిణామాలతో ఏపీలో ప్రభుత్వ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ఏపీ ప్రభుత్వం  అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కాంట్రాక్టర్లకు నేరుగా బ్యాంకుల నుంచి చెల్లించేలా చేస్తామని హామీ ఇస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే.. రోడ్ల మరమ్మతులు జరుగుతాయి. హైకోర్టు భవన నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇలా జరగాలంటే ప్రభుత్వం ముందుగా కాంట్రాక్టర్లలో నమ్మకం పెంచుకోవాల్సి ఉంది. 
Also Read : హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదాతో ఎవరికి లాభం..?

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget