అన్వేషించండి

AP Contractors : బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. టెండర్లకు స్పందన ఉండటం లేదు. పనులు ప్రారంభించిన చోట బెదిరింపుల కారణంగా ఆగిపోతున్నాయి.


ప్రభుత్వ రంగంలో ఏదైనా పనికి టెండర్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్లు వరుస కడతారు. పెద్ద పెద్ద సంస్థల నుంచి పనుల స్థాయిని బట్టి అధికార పార్టీ నేతల ద్వితీయ శ్రేణీ నేతలూ పోటీ  పడతారు. ఓ రకంగా అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరు ఇలాంటి కాంట్రాక్టులే. కానీ ఏపీలో అంతా రివర్స్ అయిపోయింది. కాంట్రాక్టులు ఇస్తామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. టెండర్లు వేయడం లేదు. అధికారులు సమావేశాలు పెట్టి సర్ది చెప్పినా నేరుగా బ్యాంకుల నుంచి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పినా ముందుకు రావడంలేదు. దీంతో ఏపీ టెండర్లలో అసలేం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది. 
రోడ్ల నుంచి భవనాల వరకూ దేనికీ స్పందించని ఏపీ కాంట్రాక్టర్లు..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. దీంతో అప్పులుతీసుకుని రోడ్లు బాగు చేయాలని పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అలాగే పెట్రోల్, డీజిల్‌పై రోడ్ల మరమ్మతుల కోసం లీటర్‌పై రూపాయి సెస్ వసూలు చేస్తున్నారు . దీంతో నిధుల కొరత లేదని అధికారులు  టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఒక్క రోడ్ల విషయంలోనే కాదు న్యూ డెలవప్‌మెంట్ బ్యాంక్ సాయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న రహదారుల పనులకూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రూ. 6400 కోట్లతో ఆ పనులను చేపట్టాలని టెండర్లు పిలిచారు. ఒక్కో పనికి ఒక్కో టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో   రద్దు చేశారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అంతే కాదు చివరికి అమరావతిలో హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి పిలిచిన టెండర్లకూ స్పందన లేదు.  రూ. 29 కోట్ల 40  లక్షల అంచనా వ్యంతో 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టడానికి టెండర్లు పిలిచారు. కానీ స్పందన లేదు.  గతంలో అమరావతిలో పనులు అంటే  ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడేవి. అలా దక్కించుకున్నవే శర వేగంగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేశాయి.  ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం ఆరు నెలల్లోనే పూర్తయింది. సెక్రటేరియట్ భవనాలూ అంతే వేగంగా పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు ఎవరూ టెండర్లు కూడా వేయడం లేదు.
AP Contractors : బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?

Also Read : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం
చేసిన పనులకు వేల కోట్లలోనే బకాయిలు..!  
సాధారణంగా కాంట్రాక్టర్లు ఓ పని చేసి బిల్లులు వసూలు చేసుకుంటారు. ఆ సొమ్ముతో మరో కాంట్రాక్ట్ పని చేస్తారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి వారికి గతంలో చేసిన పనుల తాలుకా బకాయిలే పెద్ద ఎత్తున విడుదల కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో చేసిన పనులకు తాము బిల్లులు ఇవ్వబోమని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.  రెండేళ్లుగా అటు ఉపాధి హామీ దగ్గర్నుంచి ఇటు రోడ్ల పనులు చేసిన వారికీ బిల్లులు చెల్లించడం లేదు. కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేస్తేనే వారుపనులు చేస్తామని నేరుగానే చెబుతున్నారు. మరికొంత మంది అయితే బిల్లుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు వెనుకాడకపోవడంతో నేరుగా బ్యాంకుల ద్వారా  చెల్లిస్తామని బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండగని కాంట్రాక్టర్లు, ఆ సంస్థలతో మాట్లాడాలని ప్రభుత్వ ఉన్నతాధికారులే ఇంజనీర్లను ఆదేశించారు. కానీ వారి మాటలపై కాంట్రాక్టర్లకు విశ్వాసం లేకుండా పోయింది. ఫలితంగా పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.
AP Contractors : బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?

Also Read : తెలుగు బిగ్‌బాస్‌కు సూపర్ రేటింగ్స్
అరకొర పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం బెదిరింపులు..! 
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో  చేస్తున్న పనులన్నింటినీ నిలిపివేసింది. అన్నింటికీ రివర్స్ టెండర్లకు వెళ్లింది. కాంట్రాక్టులు రద్దు చేయడంతో అప్పటి వరకూ చేసిన పనులకు చెల్లించాల్సినవి చెల్లించలేదు. కొత్తగా రివర్స్ టెండర్లేసిన వారు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇతర కారణాలతో పనులు ప్రారంభించలేదు. అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అభివృద్ధి పనులకోసం అతి స్వల్పంగా ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో రాజకీయ నేతల బెదిరింపులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోడ్ కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్న వీడియో ఇప్పటికే వైరల్ అయింది. ఆ పని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేతో పాటు బెదిరించిన నేత కూడా హాజరయ్యారు. కానీ ఇస్తామన్న కమిషన్ ఇవ్వకుండా పనులు ప్రారంభించినందుకు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు ఉన్నాయి.


ప్రభుత్వం విశ్వాసం పెంచుకుంటేనే అభివృద్ది పనులు.. !
ఓ వైపు బిల్లులు రాకపోవడం మరో వైపు అధికార పార్టీ నేతలు కమిషన్ల కోసం బెదిరింపులకు దిగడం వంటి పరిణామాలతో ఏపీలో ప్రభుత్వ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ఏపీ ప్రభుత్వం  అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కాంట్రాక్టర్లకు నేరుగా బ్యాంకుల నుంచి చెల్లించేలా చేస్తామని హామీ ఇస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే.. రోడ్ల మరమ్మతులు జరుగుతాయి. హైకోర్టు భవన నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇలా జరగాలంటే ప్రభుత్వం ముందుగా కాంట్రాక్టర్లలో నమ్మకం పెంచుకోవాల్సి ఉంది. 
Also Read : హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదాతో ఎవరికి లాభం..?

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Affordable 7 Seater Cars: 10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు
10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Embed widget