అన్వేషించండి

AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కొన్నాళ్లుగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆర్థిక నిపుణుడిని కేబినెట్ హోదాతో ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కొద్ది రోజులుగా రాజకీయం నడుస్తోంది. అలవి కానన్ని అప్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సూట్‌కేస్ కంపెనీల్లాగా సూట్‌కేస్ కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెస్తున్నారని మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనలకు లోబడి.. పరిమితులకు లోబడి మాత్రమే అప్పులు చేస్తున్నామని చెబుతోంది. అదీ కూడా ప్రజల్ని కాపాడుకునేందుకు మాత్రమే చేస్తున్నామని ఎదురుదాడి చేస్తోంది. అయితే వస్తున్న ఆదాయానికి .. చేస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడంతో ఏపీ ఆర్థిక శాఖపై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో  నిపుణుడైన ఓ సలహాదారును కేబినెట్ హోదాతో కొత్త నియమించుకున్నారు. 

ఏపీ ప్రభుత్వం చెప్పిన అప్పుల లెక్క రూ.1,27,105.81 కోట్లు..!

ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని వస్తున్న విమర్శలకు ప్రభుత్వం అధికారికంగా కౌంటర్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1,27,105 కోట్లు మాత్రమే అప్పులు చేశామని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నట్లుగా అలవిమాలిన అప్పులు చేయలేదని స్పష్టం చేసింది. పూర్తి విచక్షణతోనే నిబంధనలకు అనుగుణంగానే రుణాలు సేకరిస్తున్నామని చెబుతోంది. అంతే కాదు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు.. దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయని అందులో తప్పేమీ లేదని చెబుతున్నారు. తాము అప్పులు తెచ్చి ప్రజలకే నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత రెండేళ్ల కాలంో ప్రజల ఖాతాల్లో నేరుగా రూ. 1,05,102.22 కోట్లు జమ చేశామని లెక్కలు విడుదల చేసింది.

AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

Also Read : కాంట్రాక్టర్‌పై వైసీపీ నేత రుబాబు

టీడీపీ లెక్క ప్రకారం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 2, 01, 138 కోట్లు 

ఏపీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.1,27,105 కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అధికారిక రికార్డుల ప్రకారమే రూ. రెండులక్షల కోట్లు దాటిపోయాయని లెక్కలు చెబుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  రూ. 39,686 కోట్లు, 2020-21లో 55161 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు రూ. పదివేల కోట్లు అప్పులు చేస్తున్నారని టీడీపీ లెక్కలు విడుదల చేసింది. ఇవన్నీ కాగ్ రిపోర్టుల ప్రకారమేనని చెబుతోంది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చేసింది రూ. లక్షా 30వేల కోట్లేనని కానీ ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని కానీ రూ. రెండు లక్షల కోట్లను అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ ఏం చేశారని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో ప్రజలపై రూ. 75వేల కోట్ల పన్నుల భారాన్ని మోపారని కూడా టీడీపీ లెక్కలు చూపిస్తోంది.
AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

Also Read : ఏపీలో వినాయక చవితి పండుగకు ఆంక్షలపై వివాదం

ఆర్థిక కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..!

ఓ వైపు భారీగా రుణసమీకరణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వదిలి పెట్టడం లేదు.  మరో వైపు విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను సహా వివిధ రకాల పన్నులను ప్రభుత్వం పెంచుతోంది. పెట్రోల్, డిజిల్‌పై పొరుగు రాష్ట్రాల కన్నా ఏపీలో రూ. ఎడెనిమిది ఎక్కువ. ఈ విషయంపై పొరుగు రాష్ట్రాల పెట్రోల్ బంకులు పోస్టర్లు పెట్టి మరీ ప్రచారం చేసుకుని వ్యాపారం పెంచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీలో  ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా ఎక్కడా జరగడం లేదు. రోడ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. మరమ్మతులు కూడా చేయడం లేదు. అయినప్పటికీ ఒకటో తేదీ వచ్చే సరికి ఉద్యోగులకు జీతాలివ్వడానికే తంటాలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారం దించుకోవడానికన్నట్లుగా వృద్ధుల పించన్లను కూడా కోత కోస్తూండటంతో  ప్రజల్లో కూడా అయోమయం ఏర్పడుతోంది.
AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

Also Read : హుజురాబాద్ ఉపఎన్నిక ఆలస్యంతో ఎవరికి లాభం..?

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మరో మరో సలహాదారు నియామకం..!
      
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఏపీ ప్రభుత్వం మరో సలహాదారుడిని నియమించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా పేరున్న రజనీష్ కుమార్ అనే వ్యక్తిని కేబినెట్ హోదాతో కొత్త సలహాదారుగా నియమించకున్నారు. ఎలా నిధులు సమీకరించుకోవాలని.. వనరులన్నింటినీ ఎలా ఉపయోగిచుకోవాలన్నదానిపై రజనీష్ సలహాలు ఇస్తారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుభాష్ చంద్రగార్గ్ అనే ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆయన ఢిల్లీ లో ఉండే పని చేస్తున్నారు. ఆయన గతంలో కేంద్ర ఆర్థిక శాఖలో పని చేశారు. ఆర్థిక శాఖ నుంచి తప్పించారని చెప్పి సర్వీస్ నుంచి వైదొలిగారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఆయనను తీసుకున్నారు.  అలాగే రుణాల సేకరణ కోసం ఎస్‌బీఐ క్యాపిటల్ సంస్థతో  ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పెద్ద ఎత్తున రుణాలు ఇప్పిచింది.  

  Also Read : బిగ్‌బాస్‌ తొలి వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget