అన్వేషించండి

AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం - వైసీపీ కార్యకర్తలతో భేటీ, నియోజకవర్గం నుంచి 50 మందికి ఛాన్స్

ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానంటూ నిర్ణయాన్ని వెల్లడించి పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు సీఎం జగన్.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షలో గడప గడపకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు వెళ్లడంపై ఆరా తీసిన సీఎం జగన్ తాజాగా సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ కీలక కార్యకర్తలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు.

పర్యటనలు చేయాలని ఆదేశం..
గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించానని, పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని వారి కర్తవ్యాన్ని గుర్తుచేశారు.

6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం 
పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో కో–ఆర్డినేట్‌ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలని, వీరంతా ప్రభావంతంగా పనిచేయాలని ఆదేశించారు. కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని, ప్రభుత్వపరంగా క్యాలెండర్‌ ప్రకారం పథకాలు అందిస్తున్నాం, దీనికి తోడు గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేసుకుంటే గెలుపు అన్నది అసాధ్యంకానేకాదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను మరింత పటిష్టం చేయాలన్నారు. 

ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు
ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నామని, సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా మీమీద ఉందని ఏపీ సీఎం జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సూచించారు. ప్రతినెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నామని చెప్పారు. నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత మీదేనన్నారు. 

బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలన్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానంటూ నిర్ణయాన్ని వెల్లడించి పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు సీఎం జగన్. దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామన్నారు. జిల్లాకమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలని, పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలన్నారు. మహిళా సాధికారితకోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఈ బాధ్యత మీదేనంటూ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.


ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Best Mileage CNG cars: ట్రాఫిక్‌లోనూ అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే.. వాటి ధర, మైలేజీ చూసి తీసుకోండి
ట్రాఫిక్‌లోనూ అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే.. వాటి ధర, మైలేజీ చూసి తీసుకోండి
Assam MP Pradyut Bordoloi: అస్సాం కాంగ్రెస్ కీలక నేతలంతా వలసబాట - సిట్టింగ్ ఎంపీ రాజీనామా - బీజేపీలో చేరిక !
అస్సాం కాంగ్రెస్ కీలక నేతలంతా వలసబాట - సిట్టింగ్ ఎంపీ రాజీనామా - బీజేపీలో చేరిక !
Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget