Breaking News Live: సీఎం జగన్తో సమావేశమైన సినీ ప్రముఖులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 8 నుంచి అసలైన ఎండాకాలం మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఇంత కాలంగా మధ్యాహ్నం సమయం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలను తాకుతోంది. ఈ నుంచి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా, గోదావరి, పశ్చిమ ప్రకాశం జిల్లాల్లో ఎండ వేడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డీగ్రీల మధ్యలో కొన్ని చోట్ల నమోదవ్వనుంది. రాత్రి మాత్రం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఎండలు అంటే దీనికి ఒక లెక్క ఉంది. రోజులో సూర్యుడి కాలం పెరుగుతోంది కాబట్టి ఎండలు క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు పొడి గాలులు నిండుగా ఉంది కాబట్టి వేడి ఉంటుంది. ఇంకా అసలైన ఎండాకాలం ముందు ఉంది.. ముఖ్యంగా ఏప్రిల్-మే నెలలో. కానీ మనం ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాం కాబట్టి చలి తీవ్రత కొనసాగుతుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది.
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని భద్రాచలం బంద్..
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంద్రప్రదేశ్లో విలీనం చేయడం వల్ల భద్రాచలం పట్టణ అభివృద్దికి గొడలిపెట్టుగా మారిందని, పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎంతో సినీ ప్రముఖులు భేటీ షురూ
ముఖ్యమంత్రి జగన్తో ఆయన క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ కొరటాల శివ, పోసాని క్రిష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం వీరు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.





















