By: Ram Manohar | Updated at : 03 Feb 2023 12:27 PM (IST)
ఎయిర్ ఇండియా ప్లైట్లో మంటలు చెలరేగాయి. (Image Credits: Pixabay)
Air India Express flight:
వరుస ఘటనలు..
ఎయిర్ ఇండియాకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఓ ఘటన ఆ కంపెనీ క్రెడిబిలిటీని దెబ్బ తీస్తున్నాయి. ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటనతో చాలా రోజుల పాటు సంచలనమైంది. యాజమాన్యం కూడా అలెర్ట్ అయింది. లూప్హోల్స్ని కనిపెట్టి పరిష్కరించే ప్రయత్నాలు చేస్తోంది. అయినా...మరోసారి టెక్నికల్ సమస్య ఎదురైంది. అబుదాబి నుంచి క్యాలికట్కు వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఎడమ వైపు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే గుర్తించిన పైలట్... అబుదాబి ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. B737-800 ఎయిర్ క్రాఫ్ట్లోని ఇంజిన్లో మంటలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన వెంటనే మంటలు రావడం వల్ల తిరిగి అక్కడే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆరా తీసిన DGCA విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇలా ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో మంటలు చెల రేగాయి. గతేడాగి సెప్టెంబర్ 14న ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. మస్కట్ ఎయిర్పోర్ట్ వద్ద ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుంచి పొగలు వచ్చాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే...ప్రస్తుతం జరిగిన ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. వీలైనంత త్వరగా విచారణ జరిపిస్తామని వెల్లడించింది. విచారణ తరవాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
స్పెషల్ సాఫ్ట్వేర్తో నిఘా..
ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మహిళపై ఓ వ్యక్తి యూరినేట్ చేసిన ఘటనలో విచారణ ఓ కొలిక్కి వచ్చింది. కానీ...ఆ కంపెనీ మాత్రం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. సాఫ్ట్వేర్ ఆధారంగా విమానంలో జరిగే అన్ని యాక్టివిటీస్పైనా నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. పొరపాటున ఇలాంటి సంఘటనలు జరిగితే...అందుకు సంబంధించిన సమాచారం అంతా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తారు. ఎయిర్ ఇండియాలోని ప్రతి అధికారికీ అందుకు సంబంధించిన అన్ని వివరాలు ఆ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. పారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైట్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటన వివాదాస్పదమైంది. సిబ్బంది ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తరవాత చాలా రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడుని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఘటన న్యూయార్క్ ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయినందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు 3లక్షల రూపాయల ఫైన్ విధించింది. ఆరోపణలకు సంబంధించి ఎయిర్ ఇండియా.. ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read: Elon Musk Twitter: ట్విటర్ అకౌంట్ను ప్రైవేట్లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్