అన్వేషించండి

Ahmedabad Plane Crash: ట్రాఫిక్ జామ్ బతికించేసింది - అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న యువతి!

Ahmedabad Plane Crash: ట్రాఫిక్ జామ్ అంటే చికాకు..గంటలతరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు అసహనంగా అనిపిస్తుంది. కానీ అదే ట్రాపిక్ జామ్ విమాన ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలు కాపాడింది

Ahmedabad Plane Crash: ఆలస్యం అమృతం అవొచ్చు విషయం అవొచ్చు..కానీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మాత్రం ఓ యువతికి ఆలస్యం అమృతమే అయింది. పది నిముషాలు ఆలస్యం అయ్యాను ఫ్లైట్ మిస్సయ్యానని బాధపడింది..కానీ మిస్సైన బాధ నుంచి బయటకు రాకముందే జరిగిన దుర్ఘటన ఆమెను పెద్ద షాక్ కి గురిచేసింది. అసలేం జరిగిందంటే..

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. విమానం ఎక్కే ముందు సెల్ఫీ వీడియోలు తీసుకున్నవారు కొందరు, విమానంలో సెల్ఫీలతో సందడి చేసినవారు మరికొందరు. అందరి ఆనందం క్షణాల్లో మాడి మసైపోయింది. అయితే ఇదే విమానంలో ప్రయాణం చేయాల్సి మిస్సైంది ఓ యువతి. కేవలం 10 నిముషాలు ఆలస్యం ఆమె ప్రాణాలు కాపాడింది.

ఆమె పేరు భూమి చౌహాన్. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్ కి చేరుకునే క్రమంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఫ్లైట్ మిస్సవుతానేమో అని టెన్షన్ పడ్డారు. ఎలాగైనా చేరుకోవాలని తపన పడ్డారు. అనుకోకుండా జరిగిన ఆలస్యానికి ఫ్లైట్ మిస్సైంది. తాను ఎయిర్ పోర్టులో అడుగుపెట్టేసరికే ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. పక్కనున్న ఊరికి వెళ్లే బస్సేం కాదుకదా మరో బస్కెక్కి వెళ్లొచ్చులే అనుకోవడానికి..పోనీ సమీపంలో ఉండే మరో ప్రదేశం అయితే ప్రయాణానికి వెంటనే ఆప్షన్ చూసుకునేదేమో. అందుకే ఫ్లైట్ మిస్సవడంతో ఎయిర్ పోర్టులోనే ఆవేదనగా కూర్చుండిపోయారామె.

ఫ్లైట్  మిస్సయ్యానని ఆవేదన చెందారు కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఒళ్ళు గగొర్పొడిచే సంఘటన తెలిసి అసలేం జరిగిందో ఆమెకు అర్థంకాలేదు. అప్పటివరకూ ఫ్లైట్ మిస్సయ్యాననే ఉన్న బాధ మొత్తం పోయి..తనను ట్రాఫిక్ బతికించేంసిందనే ఆశ్చర్యం..దుర్ఘటన జరగడంపై షాక్ లో ఉండిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేను వెళ్లాల్సిన విమానం ప్రమాదానికి గురైందని తెలియగానే షాక్ కి గురయ్యా. ఆ ఘటన తల్చుకుంటే నా శరీరం  వణికిపోతోంది.. మాట్లాడలేకపోతున్నా.. మైండ్ బ్లాంక్ అయిపోయింది..ఆ దేవుడికి ధన్యావాదాలు నా గణపతి బప్పా నన్ను కాపాడాడు అంటూ భూమి చౌహన్ పోస్టులో రాసుకొచ్చారు. కేవలం పది నిముషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొన్నారామె.

లండన్ లో భర్తతో కలసి ఉంటున్నారు భూమి చౌహాన్. రెండేళ్ల తర్వాత వెకేషన్ కోసం ఆమె ఇండియాకు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఫ్లైట్ మిస్సవడంతో అతి భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 

ట్రాఫిక్ జామ్ ప్రాణాలు కాపాడింది, ఆలస్యమై ప్లైట్ మిస్సవడంతో ఆ క్షణం అయ్యో అనిపించినా.. బతికినన్ని రోజులు ఆ దేవుడే కాపాడాడు అనిపించేలాంటి ఈ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుందంటారు భూమి చౌహాన్. అందుకే ఎవరి విషయంలో ఆలస్యం విషం అయినా కానీ భూమి విషయంలో అమృతమే అయింది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget