అన్వేషించండి

ABP Southern Rising Summit 2024: కేంద్ర కేబినెట్‌లో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు - సామాన్యుల విమానయాన ఆశలకు రెక్కలు తొడుగుతారా ?

Rammohan Naidu : భారత్‌లో మధ్యతరగతి ప్రజలకు విమానయానం ఇప్పటికీ ఓ కలే. మరి రామ్మోహన్ నాయుడు దాన్ని సాకారం చేస్తారా ?

ABP Southern Rising Summit:  తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లో అత్యంత చిన్న వయసులోనే కీలక స్థానంలోకి వెళ్లిన నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన ఆయన మూడో సారి ఎంపీగా గెలిచారు. కేంద్ర విమానయానశాఖా మంత్రిగా పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన లీడర్ అని ప్రధాని మోదీ ఆయనను ప్రోత్సహిస్తూంటారు. పనితీరులో ఇతర మంత్రుల కన్నా ఎంతో ముందు ఉన్నరు. విమానయాన రంగానికి వస్తున్న సవాళ్లను ఆయన ఒంటి చేత్తో ఎదుర్కొంటున్నారు. 

భారత్‌లో విమానయానరంగం  అభివృద్ది చెందిన దేశాల మాదిరిగా విరివిగా అందుబాటులోకి రాలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా మెరుగైన విమానయాన సౌకర్యాలు ఉన్నాయి. కానీ మన దేశంలో ఊహించిన స్థాయిలో ఆకాశయానం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికీ విమానం ఎక్కడం ఓ కల. ఒక్క సారి అయినా విమాన ప్రయాణం  చేయాలనుకునేవారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. వారికి కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితి కారణం లగ్జరీనే. విమాన ప్రయాణం అంటే ఇంకా లగ్జరీగా మారింది. 

ఉడాన్ పేరుతో ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విమానాల రాకపోకల్ని.. మధ్యతరగతికి అందుబాటులో ఉంచేలా చేసేందుకు  కేంద్రం చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని నిపుణలు విశ్లేషిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్మోహన్ నాయుడు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో డిమాండ్ ఉన్న సమయంలో విమానాయాన సంస్థలు పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. వాటన్నింటిపై రామ్మోహన్ నాయుడు వర్క్ చేస్తున్నారు. 

ఇప్పుడు కొత్తగా బాంబు బెదిరింపులు కామన్ అయిపోయాయి. వాటిని నిరోధించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఆయనపై తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. తన అభిప్రాయాలను, ఆలోచలను.. దక్షిణాది రాజకీయ పయనాన్ని విశ్లేషించేందుకు  ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
KTR News: కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
Embed widget