అన్వేషించండి

C Voter Survey: 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని కేజ్రీవాల్ ఢీకొట్టగలరా? ABP సీ-ఓటర్ సర్వేలో ఆసక్తికర నిజాలు

2024 ఎన్నికల్లో ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తలపడగలరా అన్న అంశంపై సీ ఓటర్ సర్వే నిర్వహించింది.

సీ ఓటర్ సర్వేలో ఏం తేలిందంటే..

పార్టీలు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. కానీ...అందరి టార్గెట్ మాత్రం 2024 ఎన్నికలే. గత సార్వత్రిక ఎన్నికల్లో "వార్ వన్‌సైడ్" అయిపో ఎన్‌డీఏ మరోసారి అధికారం చేపట్టింది. కానీ..ఈ సారి మోడీని ఢీ కొట్టి బలమైన పోటీ ఇవ్వాలని చూస్తున్న నేతల జాబితా పెద్దగానే ఉంది. అటు పశ్చిమబెంగాల్‌ సీం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ పోటీలో నిలిచేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీదీ..ప్రతిపక్ష పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చే పనిలో పడిపోయారు. ఇటు కేసీఆర్ కూడా ఇంచుమించు అదే చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌...నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోదీ విమర్శలు చేసినా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వివాదం తెరపైకి వచ్చిన తరవాత విమర్శల పదును పెంచారు. రోజూ ఏదో విధంగా ఆయనను టార్గెట్ చేస్తూ...కేంద్రం తమను కావాలనే టార్గెట్ చేస్తోందని అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈ అన్ని పరిణామాల మధ్య ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో భాజపా వర్సెస్ ఆప్‌ ఫైట్ తప్పదని అన్నారు. 

ఎంత మంది అవును అని చెప్పారు..? 

ఇటీవల పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకున్న ఊపులో ఉన్న ఆప్...అదే జోరుతో 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌ ఫైట్‌ పైనా అందరి దృష్టి నెలకొంది. మరి ప్రధాని మోదీ చరిష్మాను ఢీకొట్టే సామర్థ్యం కేజ్రీవాల్‌కు ఉందా..? 
ఈ విషయంపై ABP News కోసం C-Voter ఓ Survey నిర్వహించింది. ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెలువడ్డాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...ప్రధాని మోదీని ఢీకొట్టగలరా అన్న ప్రశ్నపై దాదాపు 2,102 మందిపై సర్వే చేసింది C-Voter. వీరిలో దాదాపు 44% మంది "అవును" అని సమాధానమివ్వగా...56% మంది "కాదు" అని బదులిచ్చారు. మొత్తంగా చూస్తే ఈ సర్వేలో అరవింద్ కేజ్రీవాల్ వెనకబడే ఉన్నారు. 

మోడల్ వర్సెస్ మోడల్..

కేజ్రీవాల్‌, ప్రధాని మోదీని టార్గెట్ చేశారనటానికి గుజరాత్ పర్యటనే సాక్ష్యం. ఢిల్లీలో ఎక్సైజ్‌ పాలసీ రగడ నడుస్తున్న నేపథ్యంలోనే గుజరాత్‌కు రెండ్రోజుల పర్యటన కోసం వెళ్లారు కేజ్రీవాల్, సిసోడియా. గుజరాత్ ప్రజలు భాజపాను 27 ఏళ్లుగా భరిస్తున్నారని, వాళ్ల అరాచక పాలనలో వాళ్లు మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. తమ పార్టీని గెలిపిస్తే...మెరుగైన విద్య,వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గుజరాతీలందరికీ ఉచిత వైద్యం అందిస్తామనీ చెప్పారు. "ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో గుజరాత్‌లోనూ పట్టణాలు, గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం. ఉన్న ప్రభుత్వాసుపత్రులను బాగు చేయటమే కాకుండా.. కొత్త ఆసుపత్రులనూ అందుబాటులోకి తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని బస్‌ డ్రైవర్లు, కండక్టర్లు...ఆప్‌నకు ఓటు వేయాలని ప్రయాణికులకు చెప్పాల్సిందిగా కోరారు. ఢిల్లీ తరహాలోనే గుజరాత్‌లోనూ మెరుగైన పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మొత్తంగా కేజ్రీవాల్ చెప్పిందేంటంటే.."ఢిల్లీ మోడల్‌ను" గుజరాత్‌లోనూ అమలు చేస్తామని. కానీ...ఇప్పటికే భాజపా "గుజరాత్ మోడల్" అంటూ తెగ ప్రచారం చేసుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్ర పురోగతికైనా "గుజరాత్ మోడల్‌"ను ఆదర్శంగా తీసుకోక తప్పదన్న స్థాయిలో క్లెయిమ్ చేసుకుంటోంది. ఇలాంటి చోట...ఢిల్లీ మోడల్‌ను అమలు చేయటం సాధ్యమేనా..? గుజరాతీలు దీన్ని అంగీకరిస్తారా అన్నదే 
ఆసక్తికరంగా మారింది. 

Also Read: KTR : కేంద్రంలో ఉన్నది మోడీ కాదు ఏడీ ప్రభుత్వం - ఏడీ అంటే కేటీఆర్ చెప్పిన అర్థం ఏమిటంటే ?

Also Read: CBI Raid: తేజస్వీ యాదవ్‌ మాల్‌లో సీబీఐ సోదాలు, అసెంబ్లీ స్పీకర్ రాజీనామా - బిహార్‌లో ఏం జరుగుతోంది?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
Telangana High Court Zone-II: జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం.. హైకోర్టు జోన్-II బిల్డింగ్ పనులకు శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి
జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం, అరుదైన గౌరవం.. హైకోర్టు జోన్-II బిల్డింగ్ పనులకు శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Rayavalasa: అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
Embed widget