అన్వేషించండి

75th Independence Day: తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగరేసింది ఎక్కడో తెలుసా? ఆ రోజు నెహ్రూ ఏం మాట్లాడారు?

75th Independence Day: భారతదేశ స్వాతంత్య్రోద్యమం సమయంలో జాతీయ జెండాను ఆమోదించటం నుంచి జాతీయ గీతాన్ని గుర్తించే వరకూ ఎన్నో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.

దేశమే ముందు..మిగతావన్నీ తరవాతే..

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకుంటోంది భారత్. త్వరలోనే స్వాతంత్య్ర దినోత్సవాలనూ ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని పిలుపు మేరకు "హర్ ఘర్ తిరంగా"లో భాగంగా అందరి ఇళ్లపైనా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. "నేషన్ ఫస్ట్, ఆల్‌వేస్ ఫస్ట్" అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. 

1. 200 సంవత్సరాల పాటు భారత్‌ ఆంగ్లేయుల పాలనలో నలిగిపోయింది. 1857లో తొలిసారి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. దీన్నే సిపాయిల తిరుగుబాటుగా పిలుస్తారు. ఈ ఉద్యమానికి మంగళ్ పాండే నేతృత్వం వహించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్, బహదూర్ షా జఫర్, తాత్యా తోపే, నానా సాహిబ్ కూడా ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఈ తిరుగుబాటుతోనే భారతీయుల్లో చలనం మొదలైంది. వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలి, తరవాతి ఉద్యమాలకు ఊపిరినిచ్చింది.   

2.1900లో స్వదేశీ ఉద్యమం మొదలైంది. బాలగంగాధర్ తిలక్, జేఆర్‌డీ టాటా సంయుక్తంగా బాంబే స్వదేశీ కో ఆపరేషన్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఈ పోరాటాన్ని ఎంతో ప్రశంసించారు.  

3. 1906 ఆగస్టు 7వ తేదీన తొలిసారి త్రివర్ణ పతాకాన్ని కోల్‌కతాలోని పార్సీ బగన్ స్క్వేర్‌ వద్ద ఎగరేశారు. అయితే అప్పటికి జాతీయ జెండాలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులుండేవి. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకానికి ఆమోదం లభించింది. 1947 జులై 22వ తేదీన త్రివర్ణపతాకానికి తుది రూపు ఇచ్చారు. ఆగస్టు 15న ఎగరేశారు. 

4.1942 ఆగస్టు 8వ తేదీన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. 

5. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి, జాతీయ గీతం ఏమీ లేదు. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన  గీతాన్నే తీసుకుని "జనగణమన"గా పేరు మార్చారు. 1950 జనవరి 24న ఈ జాతీయ గీతాన్ని అధికారికంగా ఆమోదించారు. 

6. బ్రిటీష్ బారిష్టర్ సర్ సిరిల్ ర్యాడ్‌క్లిఫ్‌ 1947లో ఆగస్టు 3వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ర్యాడ్‌క్లిఫ్ లైన్‌గా పిలుచుకునే సరిహద్దుని ఏర్పాటు చేశారు. 

7. ఇండస్ వ్యాలీ నాగరికతకు గుర్తుగా, భారత్‌కు ఇండియా అనే పేరు పెట్టారు. 

8.1947 ఆగస్టు 15వతేదీన అర్ధరాత్రి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అదే రోజున భారత్‌తో పాటు కొరియా, కాంగో, బహ్రెయిన్, లీచ్‌టెన్‌స్టేన్ దేశాలకూ స్వాతంత్య్రం లభించింది. 

9. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగరేశారు. "ప్రపంచమంతా నిద్రపోతున్న ఈ సమయంలో భారత్‌ మేలుకొంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది" అని ప్రసంగించారు నెహ్రూ. 

10. భారత జాతీయ గేయం "వందేమాతరం". ఇది బంకించంద్ర ఛటర్జీ 1880లో రచించిన ఆనంద్‌మఠ్ నవలలోని ఓ గేయం. 1950 జనవరి24న వందేమాతర గీతాన్ని అధికారికంగా గుర్తించారు. 

Also Read: Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

టాప్ హెడ్ లైన్స్

US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Breaking News: ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది, భవిష్యత్తులో చర్చలు జరపం: ట్రంప్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది, భవిష్యత్తులో చర్చలు జరపం: ట్రంప్
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
Embed widget