అన్వేషించండి

Ladakh: లద్దాఖ్‌లో ఘోర విషాదం, యుద్ధ ట్యాంక్‌ నది దాటుతుండగా ప్రమాదం - ఐదుగురు సైనికులు గల్లంతు

Ladakh News: లద్దాఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యుద్ధ ట్యాంక్‌లో నది దాటుతుండగా ప్రవాహం పెరిగి ఐదుగురు జవాన్లు నీటిలో పడి కొట్టుకుపోయారు.

Ladakh Tank Accident: లద్దాఖ్‌ వద్ద ఘోర ప్రమాదంలో ఐదుగురు సైనికులు నదిలో గల్లంతయ్యారు. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  Line of Actual Control వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. యుద్ధ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా ఐదుగురు జవాన్లు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న Mandir Morh వద్ద నది దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ దారుణం జరిగింది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నది దాటుతుండగా ఇలా ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిలిటరీ ట్యాంక్ యాక్టివిటీ జరుగుతుండగా ఆర్మీ ట్యాంక్ ష్యోక్ రివర్‌లో ఉన్నట్టుండి చిక్కుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో నదీ ప్రవాహం పెరిగింది. అప్పటికే రెస్క్యూ టీమ్ అందుబాటులోకి వచ్చింది. కానీ...ప్రవాహ ఉద్దృతి విపరీతంగా ఉండడం వల్ల వాళ్లను బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. ఫలితంగా ఐదుగురూ నీళ్లలో పడి కొట్టుకుపోయారు. 

Also Read: Delhi Airport: పేక మేడల్లా కూలుతున్న నిర్మాణాలు, వరుస ప్రమాదాలతో మోదీ సర్కార్‌కి అగ్ని పరీక్ష

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Bail News: బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
EXCLUSIVE: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Bail News: బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
EXCLUSIVE: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
Embed widget