అన్వేషించండి

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌నీ ముంచెత్తుతున్న వర్షాలు, క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా 50 మంది గల్లంతు

Himachal Pradesh Rains: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షిమ్లాలో క్లౌడ్‌ బరస్ట్ కారణంగా 50 మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది.

Himachal Pradesh Cloudburst: వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ విపత్తుతోనే సతమతం అవుతుంటే అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే ముప్పు వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షిమ్లాలోని రామ్‌పూర్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత కురిసింది. ఈ కారణంగా దాదాపు 50 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖాడ్ వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వద్ద ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా రహదారులపైనా ప్రభావం పడింది. ఈ ప్రాంతంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు మండీలోనూ ఇదే విపత్తు సంభవించింది. ప్రయాణం చేయడానికి వీల్లేని పరిస్థితులున్నాయని, పలు చోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయని అధికారులు తెలిపారు. (Also Read: Wayanad Landslide: మృతుల దిబ్బగా మారిన వయనాడ్‌- ముమ్మరంగా సహాయ చర్యలు- సాయం ప్రకటించిన సెలబ్రిటీలు)

"ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడు స్టాఫ్‌ని, స్కూల్‌, కాలేజ్ స్టూడెంట్స్‌ని వేరే చోటకు తరలించడం కష్టం. ఈ ప్రయత్నం చేసినా అది ప్రమాదకరమే అవుతుంది. వెంటనే స్కూల్స్‌తో పాటు ట్రైనింగ్ సెంటర్స్‌నీ మూసేయాలి"

- అధికారులు

ఉత్తరాఖండ్‌లోనూ ఈ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ వర్షాలకు ఇద్దరు బలి అయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. State Disaster Response Force (SDRF) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. అర్ధరాత్రి ఒక్కసారిగా కుండపోత కురవడం వల్ల ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. హరిద్వార్‌లో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. 9 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కూలిన ఘటనలో ఈ చిన్నారులు మృతి చెందారు. ఇక్కడి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. అన్ని విధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ ముమ్మంగా కొనసాగుతోంది. 

 

Also Read: SC Sub Classify: ఎస్సీ వర్గీకరణను ఆ న్యాయమూర్తి ఎందుకు వ్యతిరేకించారు? ఆమె వినిపించిన వాదనేంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget