Madhya Pradesh CM convoy : సీఎం కాన్వాయ్కే నీళ్లు కలిపిన డీజిల్ కొట్టారు - ఈ కల్తీ కింగ్ గుండెకో దండం - వాట్ నెక్ట్స్ ?
CM Mohan Yadav Cars: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్కు కల్తీ డిజిల్ కొట్టేశారు. మధ్యలో ఆ కాన్వాయ్ మొత్తం ఆగిపోయింది. దాంతో కల్తీ దందా బయటపడింది.

Madhya Pradesh CM Mohan Yadav convoy towed after water filled instead of diesel : పెట్రోల్ బంకులు చేసే మోసాల గురించి ప్రతి సామాన్యుడికి అవగాహన ఉంటుంది. కానీ నిరూపించలేని నిస్సహాయత. వారి మోసాలకు అలా బలైపోతూ వస్తున్నారు. చివరికి వారు బరి తెగించి ముఖ్యమంత్రి కాన్వాయ్ కే కల్తీ డిజిల్ కొట్టేశారు. దాంతో వారి పాపం పండింది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్లోని 19 వాహనాలు శుక్రవారం ప్రయాణిస్తూ హఠాత్తుగా ఆగిపోయాయి. దీనికి కారణం ఏమిటా అని నిపుణులు పరిశఈలించారు. నీళ్లు కలిపిన డీజిల్ ను కొట్టడంతో అవి ఆగిపోయినట్లుగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఆ పెట్రోల్ పంప్ను సీల్ చేశారు.
మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా, దోసీగావ్లోని శక్తి ఫ్యూయల్స్ పెట్రోల్ పంప్ ఉంది. భారత్ పెట్రోలియం కంపెనీ డీజిల్ అమ్ముతారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రత్లాంలో జరిగే MP రైజ్ 2025 కాన్క్లేవ్ లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం రత్లాంకు వెళ్తారు. ఈ కాన్వాయ్లోని 19 ఇన్నోవా వాహనాలు ఇండోర్ నుండి రత్లాం వెళ్తున్న సమయంలో మధ్యలో పెట్రోల్ పంప్ వద్ద డీజిల్ నింపుకున్నాయి. డీజిల్ నింపిన కొద్ది దూరం తర్వాత, కాన్వాయ్లోని 19 ఇన్నోవా వాహనాలు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. కొన్ని వాహనాలు పెట్రోల్ పంప్ వద్దనే ఆగిపోగా మరికొన్ని హైవేపై కొంత దూరం వెళ్లిన తర్వాత ఆగిపోయాయి.
ఏమయిదా అని డీజిల్ ట్యాంకులను తనిఖీ చేసినప్పుడు, డీజిల్లో సుమారు 50 శాతం నీరు కలిసి ఉన్నట్లు గుర్తించారు. 20 లీటర్ల డీజిల్లో సుమారు 10 లీటర్లు నీరు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కలుషిత డీజిల్ వల్ల వాహనాల ఇంజన్లు పనిచేయడం ఆగిపోయింది. అదే సమయంలో, అదే పెట్రోల్ పంప్ నుండి 200 లీటర్ల డీజిల్ నింపిన ఒక ట్రక్ కూడా రోడ్డుపై ఆగిపోయింది. వెంటనే శక్తి ఫ్యూయల్స్ పెట్రోల్ పంప్ను అధికారులు వెంటనే సీల్ చేశారు. అధికారులు డీజిల్ నమూనాలను సేకరించి, పరీక్షల కోసం పంపించారు.
VIDEO | Ratlam, Madhya Pradesh: As many as 19 vehicles of CM Mohan Yadav's convoy had to be towed after water was reportedly filled instead of diesel in them. The petrol pump was later sealed over fuel contamination.#MPNews #MadhyaPradeshNews
— Press Trust of India (@PTI_News) June 27, 2025
(Full video available on PTI… pic.twitter.com/IQV9aE2Jfc
కాన్వాయ్ వాహనాలు ఆగిపోవడంతో, అధికారులు ఇండోర్ నుండి ప్రత్యామ్నాయ వాహనాలను త్వరగా ఏర్పాటు చేశారు. కాన్వాయ్ వాహనాలను డ్రైవర్లు , పెట్రోల్ పంప్ సిబ్బంది లాక్కెళ్తున్న న్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాము కల్తీ చేయలేదని వర్షానికి నీళ్లు ట్యాంకులో చేరి ఉంటాయని వారు బావిస్తున్నారు.





















