అన్వేషించండి

Bihar Bridge Collapse: ఇవి పేకమేడలా వంతెనలా, 17 రోజుల్లో కుప్ప కూలిన 12 బ్రిడ్జ్‌లు

Bridge Collapse: బిహార్‌లో వరుస పెట్టి వంతెనలు కూలిపోతున్న ఘటనలు అలజడి సృష్టిస్తున్నాయి. 17 రోజుల్లో 12 వంతెనలు కుప్ప కూలిపోయాయి.

Bridge Collapse in Bihar: బిహార్‌లో వరుస పెట్టి వంతెనలు కూలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 17 రోజుల్లో 11 బ్రిడ్జ్‌లకు ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సరన్‌ జిల్లాలో మరో బ్రిడ్జ్‌ కుప్ప కూలింది. సరన్‌ జిల్లాలో కేవలం 24 గంటల్లో మూడు వంతెనలు ఇలాగే కూలిపోయాయి. గండకీ నదిపై 15 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జ్‌ని నిర్మించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు. ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. కొద్ది రోజులుగా వంతెనలు కూలిపోతుండడంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా కూలిపోయే దశలో ఉన్న వంతెనలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నింటిపైనా సర్వే చేసి అవసరమైతే మరమ్మతులు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జ్‌ల మెయింటేనెన్స్ విషయంలో అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని తేల్చి చెప్పారు. సరన్‌ జిల్లాలో కాకుండా సివాన్, మధుబని, ఈస్ట్ చంపరన్, కృష్ణగంజ్‌లోనూ వంతెనలు కూలిపోయాయి. జూన్ 18న అరారియా జిలాల్లో వంతెన కూలింది. ఆ తరవాత జూన్ 22న సివాన్ జిల్లాలో, జూన్ 23 న ఈస్ట్ చంపారన్‌లో బ్రిడ్జ్‌లు కూలాయి. దియోరియాలో గండకీ నదిపై నిర్మించిన 40 ఏళ్ల నాటి బ్రిడ్జ్ పిల్లర్ కుంగిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. 

ఈ ఘటనలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. RJD ఇప్పటికే ప్రధాని మోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తోంది. ఇంత జరుగుతుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తోంది. ట్విటర్ వేదికగా RJD నేత తేజస్వీ యాదవ్‌ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కూడా ఏమీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. అంతా అవినీతిమయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"మాట్లాడితే అవినీతి, నిజాయతీ, జంగల్ రాజ్‌ అంటూ లెక్చర్లు ఇస్తారు. వేరే వాళ్లలో లోపాలు ఎత్తి చూపిస్తుంటారు. అంతా తమకే తెలుసని అనుకుంటారు. వీళ్లే అడ్వకేట్‌లు, జర్నలిస్ట్‌లుగా ఫీల్ అవుతుంటారు. కానీ...ఇంత జరుగుతుంటే ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు"

- తేజస్వీ యాదవ్, RJD నేత

కొంత మంది అధికారులు మాత్రం ఈ ఘటనలపై స్పందించారు. వీటిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని, అందుకే కూలిపోయి ఉంటాయని వెల్లడించారు. అదీ కాకుండా భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని వంతెనలు ధ్వంసమయ్యాయని వివరించారు. 

Also Read: Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget