అన్వేషించండి

Rohingya In Andamans: ఆకలి దప్పులకు రోహింగ్యాలు బలి, అండమాన్‌లో చిక్కుకున్న శరణార్థులు

Rohingya In Andamans: వందమంది రోహింగ్యా ముస్లింలు అండమాన్‌ దీవుల్లో చిక్కుకున్నారు.

 Rohingya In Andamans:

అండమాన్‌లో చిక్కుకుని..

కనీసం 100 మంది రోహింగ్యాలు అండమాన్ దీవుల్లో చిక్కుకున్నారు. వీరిలో 16-20 మంది దాహంతో అల్లాడిపోయి మృతి చెందారని తెలుస్తోంది. ఆకలికి తట్టుకోలేక ఇలా నేల రాలిపోతున్నారని రోహింగ్యా యాక్టివిస్ట్ గ్రూప్‌లు వెల్లడించాయి. ఏటా ఇలా వందలాది మంది రోహింగ్యాలు పడవల సాయంతో వేరే దేశాలకు వలస వెళ్తుంటారు. మయన్మార్, బంగ్లాదేశ్‌లో దారుణమైన జీవితాలకు దూరంగా గడపాలనుకున్న వాళ్లంతా ఇలా ప్రాణాలకు తెగించి మరీ దేశం దాటుతారు. వీరిలో ఎక్కువ మంది మలేషియాకు తరలిపోతారు. ఈ క్రమంలోనే ప్రాణాలూ కోల్పోతారు. ఇండియన్ నేవీ ఈ పడవను గుర్తించింది. అయితే...ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందన్నది పూర్తి వివరాలు తెలియరాలేదని నేవీ వెల్లడించింది. "కనీసం 20 మంది చనిపోయి ఉంటారు. కొంత మంది ఆకలితో, మరి కొందరు దప్పికతో ప్రాణాలు కోల్పోయారు. కొందరు తప్పించుకోవాలనే తొందరలో నీళ్లలోకి దూకి ఉంటారు. ఇది చాలా దారుణం" అని అధికారులు అన్నారు. ఇలా రెండు వారాల పాటు నీళ్లలో కొట్టుకుపోయి..ఎక్కడో తేలతారని చెప్పారు. "ఇండియన్ వెసెల్స్‌ ఆ పడవ దగ్గరికెళ్లి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉంది. అప్‌డేట్స్‌ ఏంటో తరవాతే తెలుస్తాయి" అని వెల్లడించారు. "వీలైనంత త్వరగా ఇండియన్ నేవీ వాళ్లను రక్షిస్తుందని ఆశిస్తున్నాం. ఓ పాడైపోయిన పడవను పట్టుకుని నీళ్లలో రెండు వారాలుగా ప్రయాణం చేసి వచ్చారు. వీళ్లకెక్కడా నీళ్లు, ఆహారం దొరకలేదు. కనీసం 16 మంది చనిపోయి ఉంటారు" అని రోహింగ్యా వర్కింగ్ గ్రూప్ తెలిపింది. శ్రీలంకలోనూ ఇలాంటి పడవే ఒకటి కనిపించగా...వందలాది మంది రోహింగ్యాలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. 2018లో 7 లక్షల 30 వేల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. మయన్మార్‌లో సైనిక పాలన అరాచకాలు తట్టుకోలే ఇలా పొరుగు దేశానికి వలస వెళ్తున్నారు. 

కేంద్రమంత్రి ప్రకటన..

ఈ ఏడాది ఆగస్టులో దిల్లీలోని బక్కర్‌వల ప్రాంతంలో రోహింగ్యాల కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌లు కడతామని, వారికి రక్షణ కూడా కల్పిస్తామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ప్రకటించిన కాసేపటికే...కేంద్రం ఈ ప్రకటనను ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..
ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. "అక్రమంగా దేశంలోకి వచ్చిన వాళ్లను డిటెన్షన్ సెంటర్స్‌లోనే ఉంచుతాం. వారు మన దేశం వదిలి వెళ్లేంత వరకూ ఆ కేంద్రాల్లోనే ఉంటారు" అని వెల్లడించింది. అంతే కాదు. ప్రస్తుతం బక్కర్‌వల ప్రాంతంలో ఉన్న శరణార్థుల్ని 
వేరే ప్రాంతానికి తరలించాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ప్రాంతాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించకూడదని తేల్చి చెప్పింది. టెంట్‌లలో నివసిస్తున్న 1100 మంది రోహింగ్యా శరణార్థులను అపార్ట్‌మెంట్లలోకి తరలిస్తామని, వారికి రౌండ్ ది క్లాక్ భద్రత 
కూడా కల్పిస్తామని హర్‌దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. కానీ హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ఇందుకు భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. 

Also Read: Afghan Women Banned: మహిళలకు యూనివర్సిటీల్లో నో ఎంట్రీ, విద్యార్థుల కలల్ని చిదిమేస్తున్న తాలిబన్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
Best Affordable Bikes: 4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget