అన్వేషించండి

History of Christmas Day : క్రిస్మస్​ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Back Story of Christmas Day : మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వచ్చేస్తుంది. అయితే డిసెంబర్ 25వ తేదీనే ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారో మీకు తెలుసా?

Why is 25 December celebrated as Christmas : క్రిస్టియన్స్ దేవుని కుమారునిగా భావించే యేసు క్రీస్తు జన్మించిన రోజుకు గుర్తుగా క్రిస్మస్ చేసుకుంటారు. దాదాపు అన్ని దేశాల్లో క్రిస్మస్​ను డిసెంబర్​ 25వ తేదీనే జరుపుకుంటారు. కానీ మీకు తెలుసా? యేసు క్రీస్తు డిసెంబర్ 25వ తేదీన పుట్టారని తెలిపే సాక్ష్యం ఒక్కటి కూడా లేదు. బైబిల్​లో కూడా దీని గురించిన ప్రస్తావన లేదు. అయినా సరే డిసెంబర్ 25నే ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారు? 

రోమన్ సంప్రదాయమా?

మొదటి క్రిస్టియన్ రోమన్ చక్రవర్తి కాన్​స్టాంటైన్ కాలంలో క్రిస్మస్​ను డిసెంబర్ 25వ తేదీన చేసుకోవడం ప్రారంభించారు. కానీ ఆ సమయంలో ఇది అధికారిక రోమన్ పండుగ కాదు. అయినప్పటికీ అందరూ డిసెంబర్​ 25న చేసుకోవడం ప్రారంభించారు. అయితే క్రిస్మస్​ అదే రోజు జరుపుకోవడానికి కొన్ని విభిన్న సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జీసస్​ తల్లి అయిన మేరి చాలా ప్రత్యేకమైనది. కన్య అయిన మేరి కడుపున జీసస్ పుడతారని చెప్పిన రోజు మార్చి 25న అని.. దాని తర్వాత తొమ్మిది నెలలకు డిసెంబర్ 25 వస్తుందని ఇలా చేసుకుంటారని చెప్తారు. 

యూదుల క్యాలెండర్ ఏమి చెప్తోంది..

యూదుల క్యాలెండర్ చంద్రుడిపై ఆధారపడి ఉండేది. గ్రెగోరియన్ క్యాలెండర్​ వంటి స్థిరమైన క్యాలెండర్​లలోని తేదీలతో పోలిస్తే క్రిస్మస్​ డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. పైగా కీస్తు పుట్టిన సమయంలో చలి ఎక్కువగా ఉన్నట్లు అప్పటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అందుకే శీతాకాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే శీతాకాలంలో ప్రారంభంలో తినడానికి, తాగడానికి అనువైన సమయం కూడా ఇదే. కాబట్టి పండుగను చేసుకునేందుకు అనువైన సమయంగా దీనిని పరిగణిస్తారు.

న్యూ ఇయర్​కి ముందే..

క్రైస్తవులు యేసు ప్రపంచానికి వెలుగు అని నమ్ముతారు. కాబట్టి తొలి క్రైస్తవులు యేసు జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇదే సరైన సమయమని భావించారు. న్యూ ఇయర్​కి ముందే క్రీస్తు జననం జరిగినట్లు భావిస్తారు. కాబట్టి డిసెంబర్​లోనే ఈ పండుగను చేసుకుంటారు.  అయితే రోమన్ పండుగలు నుంచి డిసెంబర్​ని 25ని క్రైస్తవులు తీసుకున్నారని కూడా ఓ రూమర్ ఉంది. ఏది ఏమైనప్పటికీ.. సెక్స్టస్​ జూలియస్ ఆఫికానస్​ నుంచి.. మార్చి 25 వరకు ప్రారంభ క్రైస్తవులకు సంబంధించిన రికార్డులున్నాయి. దాని ప్రకారం సోల్ ఇన్విక్టస్​కి చాలా సంవత్సరాల ముందే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. 

బాప్టిజం రోజు క్రిస్మస్?

ప్రారంభంలో క్రిస్మస్​ను జవరి 6న కూడా జరుపుకునేవారు. అయితే క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని కాకుండా బాప్టిజం తీసుకున్న రోజును క్రిస్మస్​గా చేసుకునేవారు. గర్భధారణ గణనపై కాకుండా.. బాప్టిజం క్రీస్తు జననం కంటే పవిత్రమైనదని భావిస్తూ దీనిని నిర్వహించేవారని చరిత్ర చెప్తుంది. అయితే యూదుల పండుగ అయిన హనుక్కాను కూడా డిసెంబర్ 25నే చేసుకునేవారు. యేసు యూదుడు కాబట్టి.. క్రిస్మస్​ను డిసెంబర్ 25 వ తేదీన చేసుకోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. 

6వ శతాబ్దంలో క్రైస్తవ మతాన్ని పరిచయం చేస్తూ.. పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు చేసేవారు. అక్కడ రోమన్ క్యాలెండర్​ను ఉపయోగించి డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకోవడం ప్రారంభించారు. అప్పుటినుంచి బ్రిటన్, పశ్చిమ యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ జరుపుకోవడం ప్రారంభించారు. 

Also Read : క్రిస్మస్​ టూర్​కి వెళ్లాలనుకుంటే.. లాంగ్​ వీకెండ్​లో ఇక్కడికెళ్లిపోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Embed widget