అన్వేషించండి

Surabhi Drama Theatre: 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి, అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే

Surabhi Drama Theatre Community | తెలుగు ప్రజలకు సుపరిచితమైన సురభి నాటక మండలి 140 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎలాంటి రీటెక్స్, కట్స్ లేకుండా సింగిల్ టేకులోనే తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.

140 ఏళ్ల చరిత్ర గల సురభి నాటక మండలి (Surabhi Drama Theatre Community) తెలుగు ప్రజలకు సుపరిచితమే. నాటకమే తమ బతుకు దెరువుగా భావించే సురభి కుటుంబం తమ పూర్వీకులు అందించిన ఈ కళా రూపాన్ని కొనసాగించేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు.

సురభి కళాకారులు చేసే నాటకాలలో కట్స్, రీ-టేక్స్ ఉండవు. ఎంత క్లిష్టమైన డైలాగులు అయినా, సింగిల్ టేక్‌లోనే చెబుతారు. చుట్టూ పందిరి, లైవ్ సౌండ్ & విజువల్ ఎఫెక్ట్స్, ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో కళాకారులు చేసే సురభి నాటకాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సురభి నాటక మండలి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద ట్రెడిషన్సల్ థియేటర్ గ్రూపుగా  రికార్డు సృష్టించింది. పౌరాణికాలతో పాటు సాహిత్య అంశాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలలోని సన్నివేశాలు, సామాజిక అంశాలపై సురభి కళాకారులు తమ నాటకాలను ప్రదర్శిస్తారు.

Surabhi Drama Theatre: 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి, అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే

పూర్వం ఊరి జాతరలలో లేదా ప్రత్యేక సందర్భాల్లో సురభి నాటకం వేయించేందుకు పిలిచినప్పుడు, ఊళ్లకు ఊళ్లు ఎడ్ల బండ్లు కట్టి చేరేవారు. కానీ కాల క్రమేణా సురభి నాటకాలకు ప్రేక్షక ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు సురభి డ్రామా థియేటర్ సభ్యులు. 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కళా సంప్రదాయం 
"సురభి అంటే కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కళా సంప్రదాయంగా మేము భావిస్తాము. నాటకమే మా జీవితం. మా పూర్వీకులు మాకు అందించిన ఈ కళను, ఇప్పుడు మేము భవిష్యత్తు తరాలకు అందించడానికి కృషి చేస్తున్నాం. మా కుటుంబంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ నాటక రంగంలో ప్రత్యేక గురింపు సాధించాలి అని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి, ఈ కళను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు." అని సురభి అరుణా దేవి అన్నారు.

Surabhi Drama Theatre: 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి, అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే

సురభి నాటకాలను కొనసాగించడంలో వీరి కుటుంబం లో యువత కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వారి వరకు ప్రతి ఒక్కరూ సురభి నాటకాలను ప్రదర్శిస్తూ వీక్షకుల ప్రశంసలు పొందుతున్నారు.

"సురభి రామలింగయ్య గారు 1885 లో సురభి నాటక మండలిని స్థాపించినప్పుడు కేవలం పల్లె జాతరల్లో ప్రదర్శనలతో మొదలైన ఈ ప్రయాణం, నేడు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. తరతరాలుగా మా కుటుంబంలో ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా భావించి నాటక రంగంలో అంకితమై పని చేస్తున్నారు. మా పూర్వీకులు చేసిన కృషిని కొనసాగించడం, వారసత్వంగా వచ్చిన ఈ కళను పునరుద్ధరించడం మా ప్రధాన లక్ష్యం," అని సురభి వేంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.

Surabhi Drama Theatre: 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి, అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే

కరోనా కాలంలో ఆన్‌లైన్ ప్రదర్శనలు:
కరోనా ప్యాండమిక్ కారణంగా స్టేజి మీద ప్రత్యక్ష ప్రదర్శనలు సాధ్యం కాకపోవడంతో, సురభి నాటకాలను ఆన్లైన్ ద్వారా ప్రజల మధ్యకు తీసుకురావడం జరిగింది. "కరోనా సమయంలో ఆన్‌లైన్ ప్రదర్శనలు చేయడం ఒక కొత్త సవాలుగా నిలిచింది. కానీ, ఈ ప్రాచీన కళా రూపాన్ని ఇలా ప్రదర్శించడం ద్వారా మేము మరిన్ని ప్రేక్షకులను చేరుకోవడం జరిగింది. మా తెలుగు NRI ల సహకారంతో Zoom వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాం," అని జయానంద్ తెలిపారు.

నాటకాలలో వైవిధ్యం:
సురభి నాటక మండలి ప్రదర్శించే నాటకాలలో చారిత్రక అంశాలు, పౌరాణికాలు, సామాజిక అంశాల ఆధారంగా ఉంటాయి. మాయాబజార్, లవకుశ, పాతాళ భైరవి, హరిశ్చంద్ర కథ, సతీసావిత్రి, పాండవ వనవాసం వంటి నాటకాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.

Surabhi Drama Theatre: 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి, అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే

భవిష్యత్తు ప్రణాళికలు:
"సురభి కళ ఎప్పటికీ చెరిగిపోదు. మారుతున్న పరిస్థితులు, సాంకేతికత ఎంతగా పెరిగినా, సురభి నాటక సమాజం ప్రజల ఆదరణ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ కళను కొనసాగించడానికి మేము అంకితభావంతో పని చేస్తాము," అని సురభి వాసుదేవ రావు తెలిపారు.

Also Read: Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AC Health Tips : ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? తలనొప్పి, అనారోగ్యం తప్పవు! జాగ్రత్తలు తీసుకోండి
ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? తలనొప్పి, అనారోగ్యం తప్పవు! జాగ్రత్తలు తీసుకోండి
Budget Travel in India : 10,000 బడ్జెట్‌లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి
10,000 బడ్జెట్‌లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Hydration Tips for Summer : సమ్మర్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ప్రమాదమే.. ఎంత తాగాలంటే
సమ్మర్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ప్రమాదమే.. ఎంత తాగాలంటే

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget