అన్వేషించండి

పొగతాగడం వల్లే క్యాన్సర్, మరోసారి రుజువు చేస్తున్న ఎయిమ్స్ అధ్యయనం

మన దేశంలో టీబీ ప్రబలంగా ఉండడం వల్ల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడంలో జాప్యం జరుగుతోందని కొత్త అధ్యయనం రుజువులు చూపుతోంది. ఏయిమ్స్ తాజా నివేదిక వెలువరించిన ఆశ్చర్యకర విషయాలు ఇక్కడ చూద్దాం.

పొగతాగే వారిలో లక్షణాలు కనిపించినా మన దేశంలో టీబీ ప్రబలంగా ఉండడం వల్ల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడంలో జాప్యం జరుగుతోందని కొత్త అధ్యయనం రుజువులు చూపుతోంది. ఏయిమ్స్ విడుదల చేసిన కొత్త అధ్యయన ఫలితాలు ఇక్కడ చూద్దాం.

లంగ్ క్యాన్సర్స్ పురుషుల్లోనే ఎక్కువ. అందుకు ముఖ్య కారణం పొగతాగడం. ఇలా పొగతాగే వారు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (SCLC) బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ మెడికల్ సైన్స్ (AIIMS) వైద్యులు నిర్వహించిన అధ్యయన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ లో లంగ్స్ లోని కణజాలాల్లో క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. చిన్నచిన్న శ్వాస నాళాలను బ్రాంకీ అంటారు. ఇక్కడ ఈ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. చాలా త్వరగా ఈ కణాల సంఖ్య పెరుగటం మాత్రమే కాదు, వీటి పరిమాణం కూడా చాలా త్వరగా పెరుగుతుంది. అంతేకాదు చాలా త్వరగా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది ఈ క్యాన్సర్.

ఉత్తర భారత దేశంలో ఈ వ్యాధి బారిన పడిన వారిని ఈ  అధ్యయనానికి ఎంచుకున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చాలా మంది పొగతాగే అలవాటున్న వారే కావడం గమనార్హం. ఇందులో 65 శాతం మంది చైన్ స్మోకర్లు. దీన్ని ఆధారం చేసుకోని డాక్టర్లు స్మోకింగ్ కు లంగ్ క్యాన్సర్ కు ఉన్న సంబందాన్ని మరోసారి రుజువు చేస్తున్నారు. వందలో ఇరవై మంది క్యాన్సర్ పేషెంట్లు మాత్రమే పొగతాగే అలవాటు లేని వారున్నారట. కచ్చితమైన కారణాలు తెలియక పోయినా మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ పీపుల్ లోనే ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని ఇండియన్ చెస్ట్ సొసైటి వారి జర్నల్  లంగ్ ఇండియాలో ప్రచురించారు.

ఈ అధ్యయనానికి 360 మంది 46-70 సంవత్సరాల మధ్య వయసున్న క్యాన్సర్ పేషెంట్లను ఎంపిక చేసుకున్నారు. వీరంతా కూడా దాదాపు 12 సంవత్సరాల పాటు ఈ అధ్యయనంలో భాగం పంచుకున్నారు. ఈ అధ్యయనాన్ని ఏయిమ్స్ పల్మనరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అనంత మోహన్, ప్రొఫెసర్, మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నిర్వహించారు. అయితే దశాబ్ధ కాలంగా ఎస్సీఎల్సీ కేసులు తగ్గుతున్నట్టు గమనించామని అంటున్నారు ఈ నిపుణులు అయితే టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ వ్యాధిని త్వరగా నిర్ధారించడంలో మాత్రం విఫలమవుతున్నామని అంటున్నారు. అందువల్ల క్యాన్సర్ సర్వైవల్ సంఖ్య అంత ఆశాజనకంగా లేదట.

ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న రోగులలో సగం మంది నిరక్షరాస్యులు లేదా స్కల్ ఫైనల్ కూడా పూర్తి చెయ్యని వారు. కనుక అవగాహాన లేమి వల్లే వారిలో పొగతాగే అలవాటు కొనసాగి ఉంటుందని అధ్యయన కారులు అభిప్రాయపడ్డారు. ‘‘ చదువు లేకపోవడం వల్లే వీరిలో స్మోకింగ్ గురించిన అవగాహన కొరవడింది. స్మోకింగ్ అలవాటు, దాన్ని మానుకునే ఆలోచన, సామర్థ్యం చదువు తద్వారా వచ్చే అవగాహనతో సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు సమస్యను త్వరగా గుర్తించడం, పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తల విషయం లో కూడా అవగాహానా లేమి వల్ల జాప్యం జరిగి వ్యాధి ముదిరిపోతోంది’’ అని అధ్యయనం చెబుతోంది.

వ్యాధి ముదిరిపోవడానికి గల కారణాల్లో 26.7 శాతం వరకు వ్యాధిని నిర్థారించడం, సరైన చికిత్స ప్రారంభించడంలో జరిగే జాప్యం వల్లే. చాలా వరకు ఈ సమస్యను టీబీ గా భావించి యాంటీ టీబీ మందులు ఇవ్వడం వల్ రోగం ముదిరిపొయ్యే వరకు తెలియడం లేదు. భారతీయ సమాజంలో టీబీ ఇంకా కూడా విస్తృతంగా ఉండడం వల్ల లక్షణాలను బట్టి క్యాన్సరా? లేక టీబీ ఇన్ఫెక్షనా? అనేది తేల్చుకునే లోపు క్యాన్సర్ ముదిరిపోతోందని కూడా ఈ అధ్యయనం అభిప్రాయపడింది. 360 మంది క్యాన్సర్ పేషెంట్ల మీద ఈ అధ్యయనం జరపగా వీరిలో కేవలం 50 శాతం మందికి మాత్రమే నిర్థుష్టమైన క్యాన్సర్ చికిత్స అందినట్టు నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న వారిలో కేవలం 49 శాతం మంది రోగులకు మాత్రమే కీమోథెరపి చికిత్స అందించారు. వీరిలో 12 మందికి మాత్రమే కంబైన్డ్  CT-RT చికిత్స అందించ గలిగారు. దీనికి ప్రధాన కారణం రేడియోథెరపి కొరకు ఎక్కువ కాలం పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల కీమో, రేడియో చికిత్సలు ఏకకాలంలో అందించడం వీలు కావడం లేదు.  ఎందుకంటే ఆ సెంటర్ లో రోగులకు సరిపడినన్ని రేడియోథెరపీ పరికరాలు అందుబాటులో ఏవని అక్కడి వారు చెబుతున్నారు. ఎస్ సీ ఎల్ సీ ప్రాథమిక దశల్లో ఉన్నవారికి ఇప్పటి వరకు ఎవరూ కూడా సర్జరీ  చేయించుకోలేదు అని ఈ అధ్యయన నివేదికి తెలియజేస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget