అన్వేషించండి

Brain Eating Amoeba : స్విమ్మింగ్ పూల్స్‌తో జాగ్రత్త, చిన్నారి మెదడు తినేసిన అమీబా - ఇది సోకితే 18 రోజుల్లోనే మరణం

Naegleria Fowleri Kerala : ఐదేళ్లపాప మెదడు తినే అమీబా సోకి చనిపోయిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. అది సోకితే ఎంత త్వరగా చనిపోతారో తెలిస్తే చాలా షాకింగ్​ ఉంటుంది. అసలు మెదడు తినే అమీబా అంటే ఏంటి?

Naegleria Fowleri Symptoms and Treatment : స్మిమ్మింగ్​ పూల్​లో పడి బాలుడు లేదా బాలిక మృతి అని చూస్తూ ఉంటాము. కానీ స్విమ్మింగ్​ పూల్​లోని నీటితో మెదడు తినే అమీబా సోకి బాలిక మృతి అనేవి రేర్​ కేసులు. అసలు కొందరికి ఇలాంటి ఓ ఇన్​ఫెక్షన్​ ఉంటుందని కూడా తెలియదు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలిక.. నేగ్లేరియా ఫౌలెరీ(Naegleria Fowleri) అనే బ్రెయిన్​ ఇన్​ఫెక్షన్​తో చనిపోయింది. దీనినే మెదడు తినే అమీబా అంటారు. అసలు ఈ ఇన్​ఫెక్షన్ ఎలా సోకింది? దీనికి ఏమైనా చికిత్స ఉందా? ఎన్నిరోజులు బతుకుతారు? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

మంచినీటి నదిలో స్నానం చేసేప్పుడు

కేరళలోని ఓ బాలిక.. తన ఇంటికి సమీపంలోని బంధువలు ఇంటికి వెళ్లింది. అక్కడ నదిలో బంధువులతో కలిసి స్నానం చేసింది. ఆ సమయంలోనే బాలికకు ప్రాణాంతకమైన అమీబా సోకినట్లు తెలుస్తోంది. స్నానం తర్వాత బాలికకు తలనొప్పి, వాంతులు కావడంతో.. బంధువులు పేరెంట్స్​కి సమాచారం చేరవేశారు. వారు పాపను వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. బాలిక మాత్రమే కాకుండా మరో నలుగురు చిన్నారులు కూడా ఆస్పత్రిలో చేరారు. వారు తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు కానీ.. బాలిక పరిస్థితి మాత్రం విషమించింది. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారంపాటు వెంటిలేటర్​పై ఉండి పాప ప్రాణాలు విడిచింది. 

కేరళలో ఇదేమి కొత్త కేసు కాదు..

ఈ తరహా ఘటన కేరళలో కొత్తేమి కాదు. గత ఏడాది జూలైలో ఓ 15 ఏళ్ల బాలుడు.. తన ఇంటి సమీపంలోని కాలువలో ఈత కొట్టాడు. అతనికి మెదడు తినే అమీబా సోకి వారంలోనే మరణించాడు. అయితే నేగ్లేరియా ఫౌలెరి మంచినీటి సరస్సులు, చెరువులు, అన్​లోరినేటెడ్ కొలనులు, అరుదైన సందర్భాల్లో పంపు నీటిలో కూడా కనిపిస్తుంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్​గా అభివృద్ధి చెంది.. ప్రాణాంతకమవుతుంది. కాబట్టి దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఎలా వ్యాపిస్తుందంటే(Naegleria Fowleri Causes).. 

మెదడు తినే అమీబా ఇన్​ఫెక్షన్​ నీటి ద్వారా ముక్కు లోపలికి చేరి.. మెదడుకు వెళ్తుంది. తద్వారా ఈ ఇన్​ఫెక్షన్ వస్తుంది. నోటితో మింగడం ద్వారా ఈ వ్యాధి సోకదు. నీటిలో ఆడటం, ఈతకొట్టడం వంటి సందర్భాల్లో ఈ ఇన్​ఫెక్షన్​ ముక్కులోకి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మనం వినియోగించే నీటిలో కూడా ఉండొచ్చు. ఈ ఇన్​ఫెక్షన్​ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. 

లక్షణాలు ఇవే.. (Naegleria Fowleri Symptoms)

మెదడును తినే అమీబా(నెగ్లేరియా ఫౌలెరి) ఇన్​ఫెక్షన్ సోకితే.. దాని లక్షణాలు ఒకటి నుంచి వారంలో రోజుల్లోపే అభివృద్ధి చెందుతాయి. తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, మెడ నొప్పి, వాంతులు ప్రారంభంలో ఉంటాయి. అనంతరం ఈ లక్షణాలు రోగిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల మూర్ఛ, మతిమరుపు, కోమా, చివరికి ప్రాణాంతకమవుతుంది. CDC ప్రకారం ఈ ఇన్​ఫెక్షన్ సోకిన చాలామంది వ్యక్తలు 18 రోజులలోపే మరణిస్తున్నారని తెలిపింది. 

నివారణ చర్యలు(Naegleria Fowleri Treatment)

ఈ ఇన్​ఫెక్షన్ సోకిన వారిలో మరణాల రేటు 85 కంటే ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రాణాంతకమైందో. కాబట్టి నీటి వనరులలో ఈతకు దూరంగా ఉండాలి. పూల్స్, స్ప్లాష్ ప్యాడ్​లు, వాటర్​పార్క్​లలో జాగ్రత్తగా ఉండాలి. అన్​లోరినేటెడ్ వాటర్​ వినియోగం మానుకోవాలి. ముక్కును క్లీన్ చేసుకోవడానికి.. పంపు నీటిని ఉపయోగించకూడదు. ఈత కొట్టే సమయంలో లేదా నీటిలోపల ఉండే సమయంలో ముక్కును మూసుకోవాలి. లేదా క్లిప్స్ ఉపయోగించవచ్చు. దీనివల్ల ఇన్​ఫెక్షన్ సోకదు. 

Also Read : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్​తో హాయిగా నిద్రపోండి

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget