అన్వేషించండి

International Day of the Unborn Child : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు

Unborn Child Day 2024: పుట్టబోయే బిడ్డను లింగ వివక్షకు గురి చేస్తూ కడుపులోనే శిశువును హతమార్చేవారు ఉన్నారు. ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ అన్​బోర్న్ చైల్డ్ డే నిర్వహిస్తున్నారు. 

International Unborn Child History : పిల్లలు లేక కొందరు క్షోభకు గురవుతుంటే.. మరికొందరు మాత్రం వివిధ కారణాలతో గర్భాన్ని తొలగించుకుంటారు. కొందరు ఇష్టంలేక అబార్షన్ చేయించుకుంటే.. మరికొందరు లింగవివక్షతో బిడ్డను అబార్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గర్భం దాల్చినప్పటి నుంచి.. బిడ్డను క్షేమంగా భూమిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏటా మార్చి 25వ తేదీన అంతర్జాతీయ వ్యాప్తంగా అన్​బోర్న్ చైల్డ్ డే (International Day of the Unborn Child 2024)ని నిర్వహిస్తున్నారు. వివిధ విషపూరిత కారణాలతో.. లింగవివక్ష నెపంతో.. చాలామంది గర్భాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించి.. అన్​బోర్న్ చైల్డ్​ డేని చేస్తున్నారు. అబార్షన్ వల్ల కలిగే నష్టాలను గురించి చెప్తూ.. పుట్టబోయే బిడ్డను అబార్షన్ చేయడం అనైతికమనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 

అంతర్జాతీయ అన్​ బోర్న్ చైల్డ్ డే చరిత్ర ఇదే..

అబార్షన్ వ్యతిరేకతపై పోరాటం చేస్తూ.. పుట్టబోయే పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో పోప్ జాన్ పాల్ II ఈ ఇంటర్నేషనల్​ అన్​బోర్న్ చైల్డ్​ డేను ప్రారంభించారు. అయితే దీనిని జీసస్ తన తల్లి కడుపులో ఉన్నప్పటి రోజును సూచిస్తుంది. అంటే మార్చి 25 నుంచి తొమ్మిది నెలల తర్వాత డిసెంబర్ 25న జీసస్ పుట్టినరోజును క్రిస్మస్​గా సెలబ్రేట్ చేసుకుంటారు. అబార్షన్ కారణంగా ఎంతో పిల్లలు తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ రోజును నిర్వహిస్తున్నారు. 1993 నుంచి ఈ దినోత్సవాన్ని జరిపేందుకు కృషి చేశారు. అయితే 2002 నుంచి దీనిని కొన్ని దేశాలు రెగ్యూలర్​గా చేస్తున్నాయి. 

ప్రాముఖ్యత ఏమిటంటే.. 

ఇంటర్నేషనల్​ అన్​బోర్న్ చైల్డ్​ డే నిర్వహించడానికి ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే.. అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధమని సూచిస్తుంది. తల్లి కడుపులో ఉన్న పిల్లల జీవితాన్ని, ఉనికిని గౌరవించాలనే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తారు. లింగ వివక్ష, ఇతర స్వార్థపూరిత కారణాలతో గర్భాన్ని రద్దు చేయడం, చేయించడం మానవ హక్కులను ఉల్లంఘిచడంతో సమానమేనని దీని ఉద్దేశం. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 

తల్లికి కూడా నష్టమే

గర్భస్రావానికి వ్యతిరేకంగా.. పుట్టబోయే శిశువుల జ్ఞాపకార్థం దీనిని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. కడుపులోనే మృత్యువాత పడుతున్న, అబార్షన్​లో ప్రాణాలు కోల్పోతున్న పిల్లలను ఈరోజు స్మరించుకుంటారు. పైగా అబార్షన్ చేయించుకోవడం వల్ల తల్లి శరీరంలో జరిగే నష్టాలను కూడా ఈరోజు గుర్తు చేస్తారు. అబార్షన్ చేయించుకోకుండా పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో దీనిని చేస్తున్నారు. 

ఇండియాలో ఇలా..

ఈ దినోత్సవాన్ని ఇండియాలో నిర్వహించరు కానీ.. అబార్షన్​కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. వెనుకబడిన ప్రాంతాల్లోనే కాకుండా.. వివిధ కారణాలతో చాలామంది అబార్షన్​ చేయించుకుంటారు. ఇది చట్టరీత్యా నేరం. అంతేకాకుండా పిల్లలను కడుపులోనే అంతం చేసే హక్కు ఎవరికీ లేదంటూ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. అబార్షన్ వల్ల తల్లికి కూడా నష్టం ఉంటుంది అంటున్నారు. ఈ ఎఫెక్ట్ తర్వాత పుట్టే పిల్లలపై కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అబార్షన్ చేసినప్పుడు కడుపులో శిశువుకి సంబంధించిన అవయవాలు ఉండిపోతే.. అది తల్లికి చాలా ప్రాణాంతకమని చెప్తున్నారు. అబార్షన్ చేయించుకోవడమే కాదు.. చేయడం కూడా భారత్​లో నేరంగానే పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా.. అబార్షన్ చేయించుకోవడం నేరం. అందుకే దీనిపై ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. 

Also Read : హోలీ సమయంలో కళ్లను ఇలా కాపాడుకోండి.. లేదంటే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget